రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం.. ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంది: వైఎస్ జగన్
ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని జగన్ అన్నారు.

YS Jagan
ఆంధ్రప్రదేశ్లోని విద్యావ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీఈసెట్ అడ్మిషన విషయంలో నెలకొన్న సమస్యలను ఆయన ప్రస్థావిస్తూ పలు వివరాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని జగన్ చెప్పారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని విమర్శించారు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు.
Also Read: రూ.25 వేలలోపే అందుబాటులో ఉన్న టాప్ 5 ల్యాప్టాప్స్ ఇవే..
ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని జగన్ అన్నారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమని చెప్పారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అంటూ ట్వీట్ చేశారు.