Affordable 5G Services In India : అక్టోబర్ 12 నాటికి భారత్‌లో సరసమైన ధరకే హైస్పీడ్ 5G సేవలు.. ముందుగా ఆ నగరాల్లోనే..!

Affordable 5G Services In India : భారతదేశంలోకి అతి త్వరలో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రెండు-మూడేళ్లలో దేశంలోని చాలా ప్రాంతాల్లో హై-స్పీడ్ 5G సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

Affordable 5G Services In India : అక్టోబర్ 12 నాటికి భారత్‌లో సరసమైన ధరకే హైస్పీడ్ 5G సేవలు.. ముందుగా ఆ నగరాల్లోనే..!

Affordable 5G Services In India Telecom minister confirms affordable 5G services will roll out in India by October 12

Updated On : August 26, 2022 / 10:25 PM IST

Affordable 5G Services In India : భారతదేశంలోకి అతి త్వరలో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రెండు-మూడేళ్లలో దేశంలోని చాలా ప్రాంతాల్లో హై-స్పీడ్ 5G సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అక్టోబర్ 12 నాటికి ప్రధాన సర్కిళ్లలో నెట్‌వర్క్ ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 29 నాటికి దేశంలో 5G కనెక్టివిటీ ప్రారంభం కానుంది. మరోవైపు ఎయిర్‌టెల్ ఈ నెలలో Airtel 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది. భారత్ ప్రపంచంలోనే అత్యంత సరసమైన మొబైల్ ప్లాన్‌లలో అందిస్తుందని, 5G సేవలతో ట్రెండ్ కొనసాగుతుందని ఓ నివేదిక నివేదించింది. టెలికం రంగంలో దాదాపు రూ. 2.5-3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. రూ. 3 లక్షల కోట్లు పెద్ద పెట్టుబడిగా మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. అంతేకాదు.. మంచి ఉపాధి కల్పనకు కూడా దారి తీస్తోందన్నారు. అంచనా ప్రకారం.. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు 5G అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షించారు.

రాబోయే రోజుల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణేలోని 13 ప్రధాన నగరాల్లో హై-స్పీడ్ 5G ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని DoT గతంలో ప్రకటించింది. కేంద్ర మంత్రి కొత్త రైట్ ఆఫ్ వే (RoW) నిబంధనల గురించి మాట్లాడారు. కేబుల్స్ వేయడం, పబ్లిక్ స్తంభాలకు యాక్సెస్, మరిన్నింటిపై విధించే ఛార్జీలను స్పష్టం చేస్తుంది.

Affordable 5G Services In India Telecom minister confirms affordable 5G services will roll out in India by October 12

Affordable 5G Services In India Telecom minister confirms affordable 5G services will roll out in India by October 12

కొత్త నిబంధనలు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిని కోరినప్పుడు ప్రైవేట్ సంస్థలకు రిలీఫ్ కలుగనుంది. ఇంతకుముందు రో అనుమతుల కోసం 343 రోజుల సమయం పట్టింది. ఇప్పుడు అది 22 రోజులకు తగ్గిందన్నారు. గత జూలైలో సగటు మరింత మెరుగ్గా ఉంది. ఇది 16 రోజులు. ROW దేశంలో సరసమైన 5G సేవలను అందించడానికి కంపెనీలకు మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

దేశంలో 5Gకి సంబంధించిన టెలికాం రంగంలో ఇప్పటికే 60వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం, ప్రధాన టెల్కోల నుంచి స్పష్టత కోసం వేచి ఉన్నాయి. ఎయిర్‌టెల్ తన 5G సేవలు ఈ నెలలో ప్రారంభమవుతాయని భావిస్తోంది. అయితే ఇది వచ్చే నెల వరకు పొడిగించవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. రిలయన్స్ Jio త్వరలో 5G సేవలను లాంచ్ చేయనుంది. అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Vi (గతంలో Vodafone Idea) కూడా దేశంలో 5G సర్వీసులను ఎప్పుడు లాంచ్ చేసేది డేట్ ప్రకటించలేదు.

Read Also : 5G Services in India : భారత్‌లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి? ఎంతమంది 5Gకి మారడానికి రెడీగా ఉన్నారో తెలుసా?