OMG : కేజీ వెండి రూ.50 వేలు

పలుకే బంగారమాయేనా.. అనే మాట మార్చిపోవాలి అందరూ. పలుకే వెండిమయమయ్యేనా అనుకోవాల్సిందే. రోజురోజుకూ పుంజుకుంటోన్న వెండి ధర ఆకాశన్నింటింది. పది రోజులుగా పెరుగుతూనే ఉన్న వెండి ధర కేజీ. రూ.50వేల 200కు చేరుకుంది. వినాయకచవితి పండుగ తర్వాతి రోజైన మంగళవారం ఏకంగా రూ.1,700 పరుగులు పెట్టింది.
వెండి ధర భారీగా పెరిగినప్పటికీ బంగారం అదే ధరను మెయింటైన్ చేస్తుంది. కస్టమర్లకు కొంత ఊరట కలిగించే అంశమిదే. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40,260 వద్ద నిలకడగానే ఉండగా 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,910 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.
గ్లోబల్ మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్ లేకపోవడం ఇందుకొక కారణం. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో వెండి మాత్రం పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.
ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.38,910కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.37,710కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర భారీగా పెరిగింది. రూ.1,700 పెరుగుదలతో రూ.50,200కు పరుగులు పెట్టింది.
గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి రెండింటి ధరలు పెరిగాయి. పసిడి ధర ఔన్స్కు 0.26 శాతం పెరుగుదలతో 1,533.35 డాలర్లకు, వెండి ధర ధర ఔన్స్కు 0.80 శాతం 18.49 డాలర్లకు పెరిగాయి.