Gold Rate: బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా.. కొత్త రికార్డులు నమోదు చేస్తున్న వెండి..

లుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర..

Gold Rate: బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా.. కొత్త రికార్డులు నమోదు చేస్తున్న వెండి..

Gold

Updated On : July 17, 2025 / 11:05 AM IST

Gold Rate: బంగారం కొనుగోలుకు సిద్ధమైన వారికి బిగ్ అలర్ట్.. ఎందుకంటే.. గోల్డ్ రేటు ఇవాళ పెరిగింది. మంగళ, బుధవారాల్లో తగ్గిన బంగారం రేటు.. గురువారం స్వల్పంగా పెరిగింది.

ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 50 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 50 పెరుగుదల చోటు చేసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ ధర 15డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ ధర 3,339 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.
మరోవైపు వెండి ధర సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.91,050కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 99,330కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,150కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 99,480కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.91,050 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 99,330కు చేరింది

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,24,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,14,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,24,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.