Gold Price Today: మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?

దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో సోమవారం ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి ధర..

Gold Price Today: మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?

gold

Updated On : October 23, 2023 / 7:12 AM IST

Gold and Silver Rate Today 23rd October 2023: భారత్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారుతున్నాయి. పది రోజుల వ్యవధిలో 22 క్యారెట్ల తులం బంగారంపై సుమారు 3వేల వరకు పెరుగుదల చోటు చేసుకుంది. అయితే, సోమవారం దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఉదయం 6గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 56,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,750 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కిలో వెండి రూ. 78,700వద్ద కొనసాగుతుంది.

Gold price

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో సోమవారం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,600 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,750 వద్ద కొనసాగుతుంది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 61,900 వద్ద కొనసాగుతుంది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750 కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 56,700 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,850 వద్ద కొనసాగుతుంది.

gold

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో సోమవారం ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,700 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,700. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో రూ.75,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ.74,500 కు చేరింది.