Gold Rate Today : బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయమా? తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Price
Gold And Silver Prices Today : 2024 ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. ఈఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 24 క్యారెట్ల తులం బంగారంపై సుమారు రూ. 800 తగ్గింది. అయితే, పరిస్థితులను బట్టిచూస్తే బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం అని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. 2023లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2024లోనూ బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరల్లో తగ్గుదల కనిపించినా.. ఈనెల చివరి వారం నుంచి మళ్లీ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన ఎనిమిది రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 800 తగ్గింది. తాజాగా మంగళవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 200 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,800కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ.63,050 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,200.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050 మార్క్ తాకింది.
– చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.58,300కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.63,600గా నమోదైంది.
వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మంగళవారం వెండి ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,800 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,800. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.76,400కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.73,500 వద్ద కొనసాగుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.