ఉన్నట్టుండి మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. మరీ ఇంతలా మార్పు ఎలా? మీరు కొంటున్నారా?

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు మాత్రం ఇవాళ ఉదయం స్థిరంగా ఉన్నాయి.

ఉన్నట్టుండి మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. మరీ ఇంతలా మార్పు ఎలా? మీరు కొంటున్నారా?

Updated On : October 31, 2025 / 10:11 AM IST

Gold Rate Today: దేశంలో ఇవాళ పసిడి ధరలు పెరిగాయి. ఇవాళ ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.1,22,680గా ఉంది.

అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,12,450గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 పెరిగి రూ.92,010గా ఉంది. (Gold Rate Today)

ఢిల్లీ, ముంబైలో పసిడి ధరలు

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,200 పెరిగి, రూ.1,22,830గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,12,600గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 పెరిగి రూ.92,160గా ఉంది.

Also Read: ‘మొంథా’ ఎఫెక్ట్‌.. వరంగల్‌ జిల్లాలో ఏడుకి చేరిన మృతుల సంఖ్య.. ఇప్పటికీ ప్రజల పరిస్థితి ఇలా..

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.1,22,680గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,12,450గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 పెరిగి రూ.92,010గా ఉంది.

బంగారం ధరలు పెరగడానికి అనేక ఆర్థిక, అంతర్జాతీయ, స్థానిక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు, రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు, స్థానిక మార్కెట్ డిమాండ్ కారణంగా బంగారం ధరలు పెరిగాయి.

స్థిరంగా వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ ఉదయం స్థిరంగా ఉన్నాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి రూ.1,65,000గా ఉంది.

ఢిల్లీ నగరంలో వెండి ధరల్లో మార్పులు లేవు. కిలో వెండి ధర రూ.1,51,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.1,51,000గా ఉంది.