గుడ్‌న్యూస్‌.. ప్రార్థనా మందిరాల్లో అమ్మే ప్రసాదంపై జీఎస్టీకి మినహాయింపు.. అంతేకాదు..: నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటనలు

ఆన్‌లైన్‌ ప్రకటనలపై డిజిటల్‌ ట్యాక్స్‌ను రద్దు చేస్తామని తెలిపారు.

గుడ్‌న్యూస్‌.. ప్రార్థనా మందిరాల్లో అమ్మే ప్రసాదంపై జీఎస్టీకి మినహాయింపు.. అంతేకాదు..: నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటనలు

Nirmala Sitharaman

Updated On : March 25, 2025 / 4:48 PM IST

ప్రార్థనా మందిరాల్లో అమ్మే ప్రసాదంపై జీఎస్టీకి మినహాయింపు ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండో విడత సమావేశాల్లో ఇవాళ లోక్‌సభలో పలు బిల్లులపై చర్చ జరిగింది.

ఆర్థిక బిల్లు 2025పై జరిగిన చర్చలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రసాదాలకు జీఎస్టీ వర్తించదని చెప్పారు. అలాగే, ఆన్‌లైన్‌ ప్రకటనలపై డిజిటల్‌ ట్యాక్స్‌ను రద్దు చేస్తామని తెలిపారు. గ్లోబల్‌ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Also Read: నవోదయ 6వ, 9వ తరగతుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

అమెరికా అధ్యక్షుడు వచ్చే నెల నుంచి ఇండియాపై టారిఫ్‌ విధిస్తామని అంటున్న నేపథ్యంలో గూగుల్, మెటా వంటి దిగ్గజ అమెరికా సంస్థలకు అనుకూలంగా ఆన్‌లైన్‌ యాడ్స్‌పై ఈ పన్ను తొలగించాలన్న ప్రతిపాదన ఉందని విశ్లేషకులు అంటున్నారు. 2016 జూన్‌ 1 నుంచి 6% పన్నును అమలు చేస్తున్నారు. దాన్నే ఇప్పుడు తొలగించనున్నారు.

ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లుపై వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. గత నెల 13న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, సెలెక్ట్‌ కమిటీకి పంపారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాలలోపు ఆ రిపోర్టును కమిటీ సమర్పిస్తుంది. మరోవైపు కస్టమ్స్ టారిఫ్‌లను కూడా రేషనలైజేషన్ చేస్తామని ఆమె చెప్పారు.