Extra Marital Affair : మహిళ హత్య-భర్త వివాహేతర సంబంధం
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పరాయి స్త్రీలతో తిరుగుతున్న భర్తను ప్రశ్నించినందుకు భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
Extra Marital Affair : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పరాయి స్త్రీలతో తిరుగుతున్న భర్తను ప్రశ్నించినందుకు భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్బి ని, ఆరు సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా బేతంచర్ల సమీపంలోని బైడ్పేట కు చెందిన హుస్సేన్ భాషాకు ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు.
అయితే హుస్సేన్ భాషా పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను తరచు వేధిస్తూ ఉండేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేని హుస్సేన్బి కొద్దికాలం క్రితం భర్తను విడిచి తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఇటీవల భాషా భార్య హుసేన్బి ని తీసుకువెళ్లేందుకు అత్తగారింటికి వచ్చాడు. తాను పూర్తిగా మారిపోయానని భార్యను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి వారిని నమ్మించాడు.
Also Read : Red Sandalwood : రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అతని మటాలు నమ్మిన అత్తమామలు హుస్సేన్బి ని భాషాతో కాపురానికి పంపించారు. భార్యను తీసుకుని తిరిగి బేతంచెర్లకు వెళ్ళాడు. అప్పటికే భార్యపై కోపం పెంచుకుని ఉన్న హుస్సేన్ భాషా నిన్న రాత్రి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో హుస్సేన్బి ఆ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడికి శిక్షపడేలా చూడాలంటూ హుస్సేన్ బి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.