రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి
రాజస్థాన్లోని ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

రాజస్థాన్లోని ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
రాజస్థాన్లోని ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దేశ్నోక్ దగ్గర కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం (నవంబర్ 12, 2019) చోటు చేసుకుంది.
బికనీర్ సమీపంలోని దేష్నాక్ పట్టణ సమీపంలోని నేషనల్ హైవేపై వేగంగా వస్తున్న కారు లారీని డీకొట్టింది. దీంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పాల్ గౌతం జిల్లా కలెక్టర్ కుమార్ పాల్ తెలిపారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని నిర్ధారించారు.