CPGET -2019 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలతో పాటు JNTUH లోని MSC కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే విద్యా సంవత్సరం (2019-20) నుంచి కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET) నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోమవారం (ఏప్రిల్ 29, 2019) CPGET-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు ఫీజుగా ఒక్క సబ్జెక్టుకు అయితే SC,ST, దివ్యాంగులు రూ.600, ఇతరులు రూ.800 చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే వారు మాత్రం ఒక్కో సబ్జెక్టుకు రూ.400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 14 నుంచి పదిరోజుల పాటు ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు మూడు చొప్పున ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం | 29.04.2019 |
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది | 30.05.2019 |
ప్రవేశ పరీక్ష ప్రారంభ తేది | 14.06.2019 |