కరోనావైరస్ చికిత్స కోసం Avigan డ్రగ్ నిల్వను జపాన్ పెంచుతోంది!

  • Published By: sreehari ,Published On : April 5, 2020 / 08:31 AM IST
కరోనావైరస్ చికిత్స కోసం Avigan డ్రగ్ నిల్వను జపాన్ పెంచుతోంది!

Updated On : April 5, 2020 / 8:31 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ పరిస్థితుల్లో జపాన్ తమ ఔషధ నిల్వలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యేకించి ఈ ఆర్థిక సంవత్సరంలో Fujifilm Holding Corp ‘అవిగాన్’ యాంటీ ఫ్లూ డ్రగ్ నిల్వను పెంచాలని జపాన్ పరిశీలిస్తోంది. ఈ ఔషధం ద్వారా 2 మిలియన్ల మందికి చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చనని ఒక ప్లానింగ్ డాక్యుమెంట్‌ను రాయిటర్స్ తెలిపింది. ప్రస్తుత స్థాయిల నుంచి ఔషధ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలని జపాన్ భావిస్తోందని స్థానిక మీడియా నివేదించింది.

కరోనావైరస్ పేషెంట్లకు ఉపయోగిస్తే 7లక్షల మందికి చికిత్స చేయడానికి సరిపోతుందని తెలిపింది. అవిగాన్ (Avigan)మెడిసిన్‌ను Favipiravir అని కూడా పిలుస్తారు. దీనిని Fujifilm అనుబంధ సంస్థ తయారు చేస్తోంది. హెల్త్‌కేర్ ఆర్మ్‌ను కలిగి ఉంది. కాకపోతే ఈ కంపెనీ ఎక్కువగా కెమెరాలకు ప్రసిద్ది చెందినదిగా చెప్పవచ్చు. ఈ ఔషధాన్ని 2014లో జపాన్‌లో ఉపయోగించడానికి ఆమోదించింది. ఇప్పటికే కోవిడ్ -19 చికిత్స కోసం అవిగాన్ డ్రగ్స్‌పై చైనాలో టెస్టింగ్ జరుగుతోంది. అత్యవసర ఉద్దీపన ప్యాకేజీలో, ఈ ఔషధాన్ని క్లినికల్ ట్రయల్ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్లాన్ చేసింది. అందుకే ఈ ఔషధంతో కరోనావైరస్ రోగులకు ట్రీట్ మెంట్ చేయడానికి అధికారికంగా ఆమోదించవచ్చు.

మాస్క్‌లు, అంటువ్యాధులను నిర్మూలించే ఔషధాలను సరఫరా చేసే దేశీయ కంపెనీలకు సబ్సిడీని పెంచాలని జపాన్ యోచిస్తోంది. నెలకు 700 మిలియన్ మాస్క్‌లను సరఫరా చేసేంత సామర్థ్యాన్ని పొందుతుంది. చైనా తన ఉత్పాదక కేంద్రంగా ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా తమ ఉత్పత్తి సౌకర్యాలను తిరిగి జపాన్‌కు తరలించే సంస్థలకు సబ్సిడీ ఇస్తుందని నిక్కీ వార్తాపత్రిక ఆదివారం నివేదించింది.

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ఒక ఉద్దీపన ప్యాకేజీని శుక్రవారం ప్రధాన మంత్రి షింజో అబే మాట్లాడుతూ.. వినియోగాన్ని ప్రభావితం చేసే సామాజిక దూర విధానాల వల్ల తీవ్రంగా నష్టపోయిన చిన్న సంస్థలు  గృహాలను లక్ష్యంగా చేసుకుంటుందని తెలిపారు. ఈ ప్యాకేజీలో చిన్న సంస్థలకు  ఆదాయంలో తీవ్ర తగ్గుదల ఎదుర్కొంటున్న గృహాలకు నగదు చెల్లింపులు ఉంటాయని చెప్పారు. నగదు కొరత ఉన్న చిన్న, మధ్యతరహా సంస్థలకు జీరో వడ్డీ రేటు రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వ అనుబంధ రుణదాతల్లో చేరాలని ప్రభుత్వం ప్రైవేటు ఆర్థిక సంస్థలను కోరనున్నట్టు షింజో వెల్లడించారు.