దిశ నిందితులు ఉరిశిక్ష నుంచి బయటపడ్డా.. నా నుంచి తప్పించుకోలేరు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉరిశిక్ష నుంచి నిందితులు బయటపడ్డా..తన నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యాలు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉరిశిక్ష నుంచి నిందితులు బయటపడ్డా..తన నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యాలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిశ హత్యాచార కేసులో మహ్మద్ కు ఉరిశిక్ష పడాలని అందరూ అంటున్నారని తెలిపారు. ఉరిశిక్ష నుంచి నిందితులు బయటపడ్డా..తన నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యాలు చేశారు. దిశను ఎంత క్రూరంగా చంపారో నిందితులకు అదే గతి పడుతుందని హెచ్చరించారు. రేపిస్ట్ ను రేపిస్ట్ అనకపోతే ఏమంటారని ప్రశ్నించారు. కేసులకు భయపడను.. దోషులకు ఉరిశిక్ష పడాల్సిందేనని అన్నారు.
ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద హైదరాబాద్ లోని బహదుర్ పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఒక మతాన్ని అవమానించేలా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయని అందిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్లో దిశపై అత్యాచారం, హత్య సందర్భంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ, తమ మతాన్ని కించపరిచారంటూ మహమ్మద్ నవాజుద్దీన్ అనే వ్యక్తి బహదుర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. (నవంబర్ 28, 2019) శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ పై నలుగురు యువకులు అత్యాచారం చేసి, హత్య చేశారు. అనంతరం షాద్నగర్ దగ్గర ఆమెను దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. నిందితుల్లో ఒకరైన మహ్మద్ ఆరిఫ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.