ఐటీ గ్రిడ్ కేసు విచారణ : ఏప్రిల్ 22 కి వాయిదా

  • Published By: chvmurthy ,Published On : March 27, 2019 / 04:31 PM IST
ఐటీ గ్రిడ్ కేసు విచారణ : ఏప్రిల్ 22 కి వాయిదా

Updated On : March 27, 2019 / 4:31 PM IST

హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కేసులో ఇంప్లీడ్ పిటిషన్‌పై హైకోర్టులో   బుధవారం వాదనలు జరిగాయి. ఇంప్లీడ్ పిటిషన్‌లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ చీఫ్ ఎన్నికల అధికారి, ఆధార్ అథారిటీ అధికారులకు , ఆంధ్రప్రదేశ్‌ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు ,డేటా  ఎన్‌రోలింగ్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్, లోకేశ్వర్ రెడ్డి తరుపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. తదుపరి విచారణను వచ్చే నెల 22కు హైకోర్టు వాయిదా వేసింది.