వరద బాధితుల కోసం మైహోం గ్రూప్ రూ. 5 కోట్లు సాయం

  • Published By: sreehari ,Published On : October 20, 2020 / 05:25 PM IST
వరద బాధితుల కోసం మైహోం గ్రూప్ రూ. 5 కోట్లు సాయం

Updated On : October 20, 2020 / 5:32 PM IST

MyHome Group contributes Rs. 5 Cr for flood relief measures in Hyderabad : భారీవర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపుకు మైహోం గ్రూప్ స్పందించింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.



“హైదరాబాద్ వాసిగా వరదబాధితులకు సాయం చేయడం మా బాధ్యత. ముఖ్యమంత్రి సహాయనిధికి 5కోట్ల విరాళం ఇవ్వడానికి ఆనందిస్తున్నామని” మైహోం గ్రూప్ ఛైర్మన్, డాక్టర్ రామేశ్వరావు అన్నారు.



ఇలాంటి కష్టకాలంలో వరదబాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చి, నిరంతరాయంగా శ్రమిస్తున్న సహాయ బృందాలకు, వివిధ సంస్థలకు మైహోం గ్రూప్ తరపున అభినందనలు తెలియచేశారు.