ఒక్కరోజులోనే రూ.17 లక్షల జరిమానాలు

గ్రేటర్ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడా ఝులిపిస్తున్నారు బల్దియా అధికారులు. రోడ్లపై వ్యర్థాలు పడేయడం, నీరు వదలడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడుతున్న వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్లో ఈ ఒక్కరోజే 17 లక్షల రూపాయల ఫైన్లు విధించారు. గడిచిన 20 రోజుల్లో కోటి 98 లక్షల రూపాయల జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు.