Delhi on flood alert : ఘజియాబాద్ను ముంచెత్తిన హిండన్ నది వరదనీరు..అలర్ట్
గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హిండన్ నదీ నీటి మట్టం గణనీయంగా పెరిగింది. హిండన్ నదిలో నుంచి వరదనీరు ఘజియాబాద్ లో కర్హేరా గ్రామాన్ని ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న 50 మందిని అధికారులు రక్షించారు....

Hindon river drowns Ghaziabad village
Delhi on flood alert : గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హిండన్ నదీ నీటి మట్టం గణనీయంగా పెరిగింది. హిండన్ నదిలో నుంచి వరదనీరు ఘజియాబాద్ లో కర్హేరా గ్రామాన్ని ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న 50 మందిని అధికారులు రక్షించారు. యమునాకు ఉపనది అయిన హిండన్ నదిలో నీటి విడుదల పెరగడంతో వరదలు ముంచెత్తాయి. (Hindon river drowns Ghaziabad village) నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందం, సాహిబాబాద్ పోలీసులు మోటర్బోట్లను ఉపయోగించి గ్రామంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Dengue Patients : ఒకే రోజు 2,292 మందికి డెంగీ జ్వరాలు…ప్రజల ఆందోళన
కొంతమంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, మరికొందరిని బంధువుల ఇళ్లకు తరలించినట్లు సాహిబాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) భాస్కర్ వర్మ తెలిపారు. గ్రామంలోని పాఠశాలలో సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హిండన్ నీటి మట్టం పెరగడంతో యమునా మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. (Delhi on flood alert as Yamuna water rises) హిండన్ నది అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న కట్టమీదుగా వరదనీరు పారింది.
China : చైనాలో జిమ్ పైకప్పు కూలి 10 మంది మృతి
దీంతో అడవులు, సమీపంలోని కాలనీలు నీట మునిగాయి. స్థానిక యంత్రాంగం సిటీ పార్కును కూడా మూసివేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం తర్వాత హత్నికుండ్ బ్యారేజీ నుంచి నదిలోకి విడుదల చేయడంతో ఆదివారం ఢిల్లీలోని యమునా నీటి మట్టం మళ్లీ 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని అధిగమించింది.