Pakistan Bomb Blast : పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ర్యాలీకి సమీపంలో బాంబు పేలుడు.. నలుగురు మృతి

ప్రభుత్వ రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై పీటీఐ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కొద్ది గంటలకే పాకిస్తాన్ లో బాబు పేలుడు ఘటన చోటుచేసుకుంది.

Pakistan Bomb Blast : పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ర్యాలీకి సమీపంలో బాంబు పేలుడు.. నలుగురు మృతి

Pakistan Bomb Blast

Updated On : January 30, 2024 / 9:40 PM IST

Imran Khan Party Rally: పాకిస్థాన్ బలూచిస్థాన్లోని సిబిలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. పాకిస్థాన్ లో ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. జైలులోఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రిక్ – ఇ -ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ మద్దతుదారులు ర్యాలీ చేస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే, ఈ పేలుడు పీటీఐ పార్టీ ర్యాలీని లక్ష్యంగా చేసుకొని జరిగిందా? బాంబు పేలుడు ఎలా జరిగిందనే విషయంపై విచారణ కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి పర్హాన్ జాహిద్ చెప్పారు. అయితే, మృతుల్లో ర్యాలీలో ఉన్నవారు ముగ్గురు ఉన్నట్లు సమాచారం.

Also Raed : Imran Khan Pakistan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్‌షాక్‌.. పీటీఐ పార్టీపై ఈసీ నిషేధం?

ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకోవటంతో ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పాకిస్థాన్ ఎన్నికల సంఘం తెలిపింది. ప్రభుత్వ రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై పీటీఐ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కొద్ది గంటలకే ఈ బాబు పేలుడు ఘటన చోటు చేసుకోవటం గమనార్హం.

Also Raed : HYD Beautification : మూసీ సుందరీకరణపై టీ సర్కార్ ఫోకస్.. లండన్‌ థేమ్స్ నదిలా అభివృద్ధిపై ప్రణాళికలు

ఎన్నికల ప్రక్రియను, దాని ఫలితాలకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ బాంబు దాడికి పాల్పడినట్లుగా ఉందని ఆ దేశ తాత్కాలిక సమాచార మంత్రి జన్ అచక్జాయ్ అన్నారు. హింస జరిగినా ఎన్నికలు జరగాల్సిందేనని, ఇలాంటి దాడులు ఎన్నికల నిర్వహణను నిరుత్సాహపర్చదని అన్నారు.