భూమిపై జీవులు అంగారకుడిపై కూడా బతకగలవు : కొత్త అధ్యయనం

Earthly Life Could Survive On Mars : అంగారకుడిపై మనుగడ సాధ్యమేనా? భూమిపై జీవించినట్టే మార్స్ గ్రహంపై కూడా మనుషులు మనుగడ సాగించగలరా? అంటే సాధ్యమే అంటోంది కొత్త అధ్యయనం.. ఎందుకంటే.. అంగారకుడిపై ఉండే వాతావరణం దాదాపు భూమిపై ఉండే వాతావరణం మాదిరిగానే ఉంటుందని అంటున్నారు. వాతావరణం చల్లగానూ, పొడిగా ఉండే అంగారకుడి ఉపరితలంపై అతినీలలోహిత కాంతిని ప్రసరిస్తుంటుంది. వాస్తవానికి అక్కడ జీవం ఉందో లేదో మిస్టరీగానే ఉంది. రెడ్ ప్లానెట్ పై ఒకప్పుడు జీవం ఉండేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అధ్యయనాల ప్రకారం.. భూమిపై జీవించే జీవులు అంగారకుడిపై తాత్కాలికంగా మనుగడ జీవించగలవని చెబుతున్నాయి.
దీనిపై రీసెర్చర్లు సైతం లోతుగా అధ్యయనాలు చేస్తున్నారు. ఒక బెలూన్ లో బ్యాక్టీరియా, ఫంగీలను స్ట్రాటో ఆవరణంలోకి పంపినపుడు అక్కడి ప్రాంతంలో మార్టియన్ అంగారకుడి వాతావరణ పరిస్థితులను కల్పించి పరిక్షించారు. అలాగే సూర్యుని నుంచి యూవీ రేడియేషన్ ప్రతిబింబించేలా చూశారు. ఇందులో అన్ని సూక్ష్మజీవులు తట్టుకోలేకపోయాయి. కానీ వాటిలో కొన్ని బాక్టీరియాలు మాత్రమే యూవీ కాంతిని తట్టుకోగలిగాయి. రెడ్ ప్లానెట్లో మనుగడ సాధ్యమే అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణగా రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు.
అంగారకుడి మట్టిపై సూక్ష్మజీవులు :
పరిశోధకులు మార్టిన్ ఉల్క నుండి పొందిన మట్టిపై సూక్ష్మజీవులను పెంచారు. ఈ బృందం ఉల్క నార్త్వెస్ట్ ఆఫ్రికా (NWA) 7034ను ఉపయోగించింది. 4.5 బిలియన్ ఏళ్ల నాటి అంగారక గ్రహానికి చెందిన ఒక ముక్క భాగం. రెడ్ ప్లానెట్పై ప్రారంభ ఏళ్లలో కెమోలిథోట్రోఫ్స్తో సమానమైన జీవం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ కెమోలిథోట్రోఫ్లు ఇనుము, మాంగనీస్ అల్యూమినియం ఫాస్ఫేట్లతో తయారైన ఖనిజ గుళికలు ఉన్నాయని బృందం కనుగొంది.