ఏంటి మిస్టరీ : అమ్మాయి డెడ్ బాడీలో అబ్బాయి డీఎన్ఏ
డీఎన్ఏ పరీక్షల కోసం సెప్టెంబర్ 17న నిమృత మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. టెస్టులు చేస్తున్న సమయంలో ఆసక్తికర

డీఎన్ఏ పరీక్షల కోసం సెప్టెంబర్ 17న నిమృత మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. టెస్టులు చేస్తున్న సమయంలో ఆసక్తికర
పాకిస్తాన్లో వింత చోటు చేసుకుంది. ఓ యువతి మృతదేహంలో యువకుడికి సంబంధించిన డీఎన్ఏ కణాలను గుర్తించారు. పాకిస్తానీ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది. సింధ్ ప్రావిన్స్లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్ కాలేజీలో నిమృత కుమారి ఫైనలియర్ చదువుతుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే నిమృత సెప్టెంబర్ 16న తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
డీఎన్ఏ పరీక్షల కోసం సెప్టెంబర్ 17న నిమృత మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. టెస్టులు చేస్తున్న సమయంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నిమృత దేహం నుంచి సేకరించిన రక్త నమూనాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా… అబ్బాయికి సంబంధించిన డీఎన్ఏ వివరాలు వచ్చాయి. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. ఇన్నాళ్లు నిమృత ఆత్మహత్య చేసుకుందన్న కోణంలో విచారించామని.. డీఎన్ఏలో అబ్బాయికి సంబంధించిన కణాలు రావడంతో కేసు కీలక మలుపు తిరిగిందన్నారు.
విషయం తెలుసుకున్న నిమృత కుటుంబసభ్యులు ఆమెని హత్య చేశారని ఆరోపిస్తూ సింద్ హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన సింధ్ కోర్టు.. నిమృత కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిమృతది హత్యా? ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సెప్టెంబర్లో కాలేజ్లో హిందూ, మైనారిటీకి సంబంధించి ప్రిన్సిపాల్తో జరిగిన గొడవలో నిమృత ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 32 మందితో పాటు మృతురాలి కాల్డేటా ఆధారంగా తోటి విద్యార్థులు మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్లను అనుమానితులుగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విషయమై కాలేజీలో విచారించగా నిమృత తన హాస్టల్ గదిలోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
తన సోదరిది ముమ్మాటికి హత్యేనని, ఆమె మెడకు కేబుల్ వైర్తో బిగించినట్టు, చేతులను బలవంతంగా పట్టుకున్నట్టు గుర్తులు కూడా ఉన్నాయని నిమృత సోదరుడు చెప్పారు. మెహ్రన్ అబ్రో, నిమృతలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, శారీరకంగా కూడా దగ్గరయ్యారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. దీంతో నిమృత పెళ్లి ప్రస్తావన తేవడంతో.. అబ్రో ఈ అఘాయిత్యానికి ఏమైనా ఒడిగట్టాడా అనే కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. నిమృత డెత్ మిస్టరీని త్వరలోనే చేధిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేశారు. డీఎన్ఏ కారణంగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది.