Russia Support India: భారత్‌కు రష్యా ఫుల్ సపోర్ట్.. ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన రష్యా అధ్యక్షుడు

సిమ్లా అగ్రిమెంట్ ను అమలు చేయాల్సిందేనని పాకిస్తాన్ కు సూచించింది.

Russia Support India: భారత్‌కు రష్యా ఫుల్ సపోర్ట్.. ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన రష్యా అధ్యక్షుడు

Updated On : May 5, 2025 / 4:47 PM IST

Russia Support India: పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తతల వేళ భారత్ కు రష్యా మద్దతుగా నిలిచింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. భారత్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం అంతానికి తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పుతిన్ తెలిపారు.

పాకిస్తాన్ కు మద్దతుగా చైనా వాదన వినిపిస్తున్న వేళ కరెక్ట్ టైమ్ కి వ్లాదిమిర్ పుతిన్ ఎంట్రీ ఇచ్చారు. ఇండియన్ ఆర్మీకి రష్యాలో తయారైన ఇగ్లా ఎస్ మిస్సైల్ డీల్ కుదిరింది. 250 కోట్ల విలువైన ఈ అగ్రిమెంట్ అత్యవసర సమయాల్లో వెస్ట్రన్ ఫ్రంట్ డిఫెన్స్ ప్రోగ్రామ్ విభాగంలో రష్యా ఇండియాతో చేసుకుంది.

Also Read: పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్.. ఆ డ్యామ్ గేట్లు డౌన్.. అక్కడి ప్రాంతాలు ఎడారే..

ఈ క్షిపణులు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కి సరఫరా కూడా జరిగిపోయింది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కేటగిరీలో కొన్ని రోజుల క్రితమే ఈ ఆయుధాలు ఆర్మీకి డెలివరీ అయినా.. తాజాగా మరో బ్యాచ్ రష్యా నుంచి రక్షణ దళాలకు వచ్చాయి. పహల్గాం దాడి తర్వాతే ఈ రెండో బ్యాచ్ ఆయుధాలను రక్షణ శాఖ తెప్పించుకుంది. వీటితో పాటే ఇండియన్ ఆర్మీ 48 రాకెట్ లాంచర్లు, 90 షౌరాజ్ మిస్సైల్స్ కు కూడా టెండర్లు పిలిచింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన రష్యా.. ఆదివారం జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ సమావేశంలో సిమ్లా అగ్రిమెంట్ ను అమలు చేయాల్సిందేనని పాకిస్తాన్ కు సూచించింది.

ఇదే సమయంలో యూరప్ సహా వెస్ట్రన్ కంట్రీస్ కు మన విదేశాంగ మంత్రి జైశంకర్ షాక్ ఇచ్చారు. మాకు ఈ సమయలో పార్ట్ నర్స్ కావాలే తప్ప ప్రీచర్లు కాదంటూ చురకలు అంటించారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలపై యూరప్ సహా కొన్ని దేశాలు సుద్దులు చెప్పగా జైశంకర్ ఇలా కౌంటర్ ఇచ్చారు. తమ దేశంలో తాము పాటించని ప్రవచనాలు మాకు అక్కర్లేదన్నారు జయశంకర్.

 

”రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణ నష్టానికి పుతిన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు పూర్తి మద్దతిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన నొక్కి చెప్పారు” అని ” అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

“ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ఇద్దరు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. 80వ విజయ దినోత్సవాల సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయనను ఆహ్వానించారు” అని జైస్వాల్ వెల్లడించారు.