Girls Demanded Gym In College : కాలేజీలో జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ..వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థినులు
రాజస్థాన్ జైపూర్ లోని మహారాణి కాలేజీ అమ్మాయిలు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశారు. కాలేజీలో ఏటీఎం, ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నినాదాలు చేశారు.
![Girls Demanded Gym In College : కాలేజీలో జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ..వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థినులు Girls Demanded Gym In College : కాలేజీలో జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ..వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థినులు](https://10tv.in/wp-content/uploads/2022/08/Girls-Demanded-Gym-In-College.jpg)
Girls Demanded Gym In College
Girls Demanded Gym and ATM In College : రాజస్థాన్ జైపూర్ లోని మహారాణి కాలేజీ అమ్మాయిలు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశారు. కాలేజీలో ఏటీఎం, ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నినాదాలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మహారాణి కళాశాలలో ముగ్గురు విద్యార్థినులు ఓవర్ హెడ్ ట్యాంకు ఎక్కారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తమకు ఏటీఎంతో పాటు ఓపెన్ ఎయిర్ జిమ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థినిలు చేసిన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాలికలు దిగివచ్చారు.
దీని గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) యోగేష్ గోయల్ మాట్లాడుతూ ముగ్గురువిద్యార్థినిలు పలు డిమాండ్లతో ట్యాంక్ పైకి ఎక్కారని తెలిపారు. వారు దిగేందుకు నిరాకరించడంతో తల్లిదండ్రులను పిలిపించి ఒప్పించే ప్రయత్నం చేశామని తెలిపారు. విద్యార్థి సంఘాల ఎన్నికలకు ముందు..కాలేజీ క్యాంపస్ లో ఏటీఎం మిషన్లు, బ్యాంకులు, ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని తెలిపారు.
కాగా..రాజస్థాన్ యూనివర్సిటీలో ఉన్న వాటర్ ట్యాంక్పైకి ముగ్గురు విద్యార్థి నేతలు ఎక్కారు. గత 48 గంటలుగా దానిపైనే ఉన్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికల తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ తేదీని పొడిగించటానికి ప్రభుత్వం ఇప్పటికే నిరాకరించింది. ముగ్గురు విద్యార్థి నాయకులను ఒప్పించేందుకు సీనియర్ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్లో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ఆగస్టు 26న జరగనుంది..పోలింగ్ పూర్తి అయ్యాక ఓట్ల లెక్కింపు 27న జరగనుంది.