గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3: ఆద్యతో కలిసి మొక్కలు నాటిన రేణు దేశాయ్..

  • Published By: sekhar ,Published On : July 3, 2020 / 02:33 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3: ఆద్యతో కలిసి మొక్కలు నాటిన రేణు దేశాయ్..

Updated On : July 3, 2020 / 3:01 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన కూతురు మరియు కూతురి స్నేహితురాలుతో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో హీరోయిన్, దర్శకురాలు రేణు దేశాయ్ మొక్కలు నాటారు .

ఈ సందర్భంగా దేశాయ్ మాట్లాడుతూ: ‘ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనందరం అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడ్డాం. మన చిన్నతనంలో స్వంత గృహాలలో ఉండడంవల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునే వాళ్లం. కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం లేదు. కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు నా కూతురు ఆద్య మరియు కూతురు స్నేహితురాలు యషిక ఇద్దరినీ నేను ఇక్కడికి తీసుకు వచ్చాను. వారి వయసు 10 సంవత్సరాలు. వారికి మొక్కలను ఏ విధంగా నాటాలి.. మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏమిటి.. అనే విషయాన్ని తెలపడం కోసం వాళ్ళిద్దర్నీ తీసుకురావడం జరిగింది.

ఇప్పుడు నాటే మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకున్నా కూడా భవిష్యత్ తరాలకు పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాటిన మొక్క యొక్క ఉపయోగం ఉంటుంది. దాని ఫలాలు భవిష్యత్ తరాలవారు అందుకుంటారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా కూతురుతో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ముగ్గురికి ఛాలెంజ్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత’ అని తెలిపారు.

Green India Challenge

Read:తన పేరుతో అమ్మాయిలకు వల.. పోలీసులను ఆశ్రయించిన ‘RX 100’ దర్శకుడు..