Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. ఫొటోలు
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన భర్త, కొడుకుతో కలిసి గురువారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బోర్గావ్ గ్రామం నుంచి గురువారం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా నడిచారు. యాత్ర ప్రారంభమైన నాటినుంచి మొదటిసారి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రెహాన్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ రాహుల్ కలిసి పాదయాత్రలో పాల్గొనడంతో కాంగ్రెస్ శ్రేణులతో పాదయాత్ర ప్రాంతాలన్ని కిక్కిరిసిపోయాయి.