Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
ఇప్పటికే సాయం పొందుతున్న రైతులతోపాటు, కొత్త లబ్ధిదారులకు కూడా ఈసారి రైతు బంధు అందుతుంది. ఈ నెల 5 లోపు రిజిస్ట్రేషన్ పూర్తై, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన కొత్త వారికి కూడా సాయం అందుతుంది.
Rythubandhu: తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్న రైతుబంధు పంపిణీ రేపటి (జూన్ 28) నుంచి ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింది రైతు బంధు నిధులు అందుతాయి. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఆదేశించారు.
Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
దీంతో వెంటనే సీఎస్ సోమేష్ కుమార్ రైతు బంధు పంపిణీకి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సాయం పొందుతున్న రైతులతోపాటు, కొత్త లబ్ధిదారులకు కూడా ఈసారి రైతు బంధు అందుతుంది. ఈ నెల 5 లోపు రిజిస్ట్రేషన్ పూర్తై, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన కొత్త వారికి కూడా సాయం అందుతుంది. కొత్తగా భూ యాజమాన్య హక్కులు పొందిన రైతులు తమ పట్టాదారు పాస్బుక్ వివరాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు ఏఈవోకు సమర్పించాలి. గత ఏడాది వానా కాలం సీజన్ కోసం కొత్త లబ్ధిదారుల నమోదుకు జూన్ 10 చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ఏడాది కూడా జూన్ 5ని చివరి తేదీగా నిర్ణయిచింది.
Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
గత సీజన్లో దాదాపు 63 లక్షల మందికి రైతు బంధు సాయం అందితే, ఈ ఏడాది అంతకుమించి రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ సారి రైతు బంధు సాయం కోసం దాదాపు రూ.8 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమవుతాయి.