Director Mahi V Raghav : యాత్ర 2 వాళ్ళ కోసమే తీస్తున్నాం అనుకున్నా పర్లేదు.. ఏపీ ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు..
తాజాగా యాత్ర 2 సినిమా మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Mahi V Raghav : గతంలో YSR బయోపిక్ యాత్ర సినిమాతో మెప్పించిన డైరెక్టర్ మహి v రాఘవ్ ఆ తర్వాత పలు సిరీస్ లు, సినిమాలు చేశారు. యాత్ర సినిమా గత ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసి మంచి విజయం సాధించారు. అయితే ఈ సినిమా YS జగన్ కి ఎలక్షన్స్ లో కూడా ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చిందని పలువురు వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంలోనే యాత్ర 2 సినిమాతో రాబోతున్నారు.
తాజాగా యాత్ర 2 సినిమా మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక ఇది YS జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అని, 2009 నుంచి 2019 వరకు జగన్ జీవితంపై ఈ సినిమా ఉండబోతుందని చిత్రయూనిట్ స్వయంగా ప్రకటించారు. అయితే మళ్ళీ ఎలక్షన్స్ టైంలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తుండటంతో ఈ సారి కూడా జగన్ కోసమే ఈ సినిమా తీస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి.
Nayan Vignesh : నయనతార – విగ్నేష్ శివన్పై కేసు నమోదు.. ఆస్తి తగాదాల విషయంలో సొంత కుటుంబ సభ్యులే..
ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మహి v రాఘవ్ ఈ సినిమాపై వస్తున్న కామెంట్స్ గురించి మాట్లాడుతూ.. బయటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోటి అనుకుంటారు. అలాంటివి అన్ని పట్టించుకుంటే నేను సినిమా తీయలేను. నేను ఎవరికోసం సినిమా తీస్తున్నాను అనుకున్నా పర్లేదు. సినిమాలో కమర్షియాలిటీ కూడా ఉండాలి కాబట్టే ఎలక్షన్ టైంకి రిలీజ్ చేస్తే ఇంకా కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది అనుకున్నాం అంతే. నేను ఎవరికోసం సినిమా తీయట్లేదు. మా సినిమా చూసి ప్రేక్షకులు ఎమోషనల్ అవుతారు, ప్రభావితం అవ్వరు. ఏపీ ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు. సినిమా చూసినా, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓట్లు వేసుకుంటారు అని అన్నారు. దీంతో డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనేది త్వరలోనే తెలియచేస్తామని, నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ మొదలుపెడతామని ప్రకటించారు.