Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ నుండి గతకొద్ది రోజులుగా వరుస అప్‌డేట్స్ వస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై యావత్ సౌత్ ఇండస్ట్రీలతో....

Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?

Teaser Date Fixed For Maniratnam Ponniyin Selvan

Ponniyin Selvan: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ నుండి గతకొద్ది రోజులుగా వరుస అప్‌డేట్స్ వస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై యావత్ సౌత్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. హిస్టారికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో సౌత్‌తో పాటు నార్త్‌లోని పలువురు హేమాహేమీలు నటిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విక్రమ్, కార్తి, ఐశ్వర్యా రాయ్‌లకు సంబంధించిన పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేసిన మణిరత్నం, ఈ సినిమాపై అమాంతం క్రేజ్‌ను పెంచేశాడు.

Ponniyin Selvan : డెడికేషన్.. గాయంతోనే షూటింగ్‌కి ప్రకాష్ రాజ్..

అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో సూపర్ సెన్సేషన్ అప్‌డేట్ ఇచ్చేందుకు ఈ లెజెండరీ డైరెక్టర్ రెడీ అవుతున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొన్నియిన్ సెల్వన్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మణిరత్నం అండ్ టీమ్ రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉండే ఈ హిస్టారికల్ మూవీ టీజర్‌ను జూలై 8న రిలీజ్ చేస్తారనే వార్త కోలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇక ఈ టీజర్ లాంఛ్‌కు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు చాలా లిమిటెడ్‌గా గెస్టులు వస్తారని తెలుస్తోంది.

Ponniyin Selvan: మణిరత్నం PS-1కు కళ్ళు చెదిరే ఓటీటీ డీల్?!

చెన్నైలో జరిగే ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను చాలా సాదాసీదాగా నిర్వహించాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ టీజర్‌ను అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఇక ఈ టీజర్ ప్రేక్షకులను అలరించడంలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమాలో జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాజేష్, శోభిత ధూళిపాళ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేసేందుకు మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడు.