Veera Simha Reddy: టీఆర్పీ రేటింగ్స్‌కు ఎసరు పెట్టిన వీరసింహారెడ్డి.. బుల్లితెరపై బాలయ్య బ్లాస్ట్ ఎప్పుడంటే..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ ఏప్రిల్ 23న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ కానుంది.

Veera Simha Reddy: టీఆర్పీ రేటింగ్స్‌కు ఎసరు పెట్టిన వీరసింహారెడ్డి.. బుల్లితెరపై బాలయ్య బ్లాస్ట్ ఎప్పుడంటే..?

Veera Simha Reddy Locks World Television Premiere Date

Updated On : April 17, 2023 / 11:06 AM IST

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించగా, బాలయ్య మరోసారి తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. పవర్‌ఫుల్ డైలాగులు పేలుస్తూ థియేటర్లలో బాలయ్య రచ్చ చేశాడు. ఈ సినిమాలో డ్యుయెల్ రోల్‌లో నటించి మరోసారి తనదైన మార్క్ వేసుకున్నాడు.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి నయా రికార్డు.. ఓటీటీలో జై బాలయ్య మేనియా!

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్‌తో దుమ్ములేపింది. ఈ సినిమాను ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ చేస్తున్నారు. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. వీరసింహారెడ్డి మూవీని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఏప్రిల్ 23న సాయంత్రం 5.30 గంటలకు టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రముఖ ఛానల్ స్టార్ మా పేర్కొంది. దీంతో ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి బ్లాస్ట్ చేయనుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Veera Simha Reddy: పాన్ ఇండియా మూవీగా వస్తున్న వీరసింహారెడ్డి

బాలయ్య సినిమాలకు బుల్లితెరపై కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది. ఈ క్రమంలో వీరసింహారెడ్డి మూవీ కూడా సాలిడ్ టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య చెల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.