SSMB 29 : మహేశ్-రాజమౌళి సినిమా క్లైమాక్స్ చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్..! పండగే అంటున్న అభిమానులు
ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్లోనే కాదు అంతర్జాతీయంగా రాజమౌళి తదుపరి చిత్రంపై ఎంతో ఆసక్తి నెలకొంది. జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉండనుందని ఇప్పటికే తెలియజేశారు.
![SSMB 29 : మహేశ్-రాజమౌళి సినిమా క్లైమాక్స్ చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్..! పండగే అంటున్న అభిమానులు SSMB 29 : మహేశ్-రాజమౌళి సినిమా క్లైమాక్స్ చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్..! పండగే అంటున్న అభిమానులు](https://10tv.in/wp-content/uploads/2023/06/Rajamouli-Mahesh-Babu-Vijayendra-Prasad.jpg)
Rajamouli-Mahesh Babu-Vijayendra Prasad
SSMB 29-Vijayendra Prasad: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్లోనే కాదు అంతర్జాతీయంగా రాజమౌళి తదుపరి చిత్రంపై ఎంతో ఆసక్తి నెలకొంది. జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉండనుందని ఇప్పటికే తెలియజేశారు. రాజమౌళి, మహేశ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్గా రూపొందనున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా అప్డేట్ల గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్ర రచయిత, రాజమౌళి తండ్రి కే.విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తూ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర అంశాలను చెప్పారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Guntur Kaaram : ఎట్టకేలకు మొదలైన గుంటూరు కారం షూటింగ్.. మహేష్ బ్యాక్ టు షూటింగ్..
మహేశ్-రాజమౌళి సినిమా స్క్రిప్ట్ పని పూర్తి కావొచ్చిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. జూలై చివరి నాటికి మొత్తం పూర్తి చేసి రాజమౌళికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా కు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించే విధంగా క్లైమాక్స్ ఉంటుందని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే సీన్స్ రాసినట్లు వెల్లడించారు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో మహేశ్ అభిమానులు పుల్ ఖుషీగా ఉన్నారు. రాజమౌళి-మహేశ్ కాంబినేషన్లో ఒకటి కాదు రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉండడమే అందుకు కారణం.
ఇక ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్ ఉందనుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఫస్టాప్లో రెగ్యులర్ షూటింగ్ను మొదలు పెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్.. పారితోషికం అన్ని కోట్లా..?
ఇదిలా ఉంటే.. మహేశ్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ప్రకటించింది చిత్రబృందం. అయితే.. ఇటీవల పూజా ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.