Bihar AIIMS: పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభం
భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై ట్రయ్స్ ప్రక్రియ ప్రారంభమైంది. బిహార్ రాజధాని పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ కరోనా టీకా ట్రయల్స్ పిల్లలపై ప్రారంభమయ్యాయి. టీకాలు వేయటానికి 15 మంది పిల్లలను ట్రయల్స్ కోసం ఎంపిక చేయగా.. అన్ని పరీక్షల అనంతరం ముగ్గురికి వ్యాక్సిన్ వేశారు.

Bihar (1)
Bihar AIIMS : భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ టీకా పిల్లలపై ట్రయ్స్ ప్రక్రియ ప్రారంభమైంది. బిహార్ రాజధాని పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ కరోనా టీకా ట్రయల్స్ పిల్లలపై ప్రారంభమయ్యాయి. టీకాలు వేయటానికి 15 మంది పిల్లలను ట్రయల్స్ కోసం ఎంపిక చేయగా.. అన్ని పరీక్షల అనంతరం ముగ్గురికి వ్యాక్సిన్ వేశారు. సుమారు వంద మందిపై ట్రయల్స్ నిర్వహించాల్సి లక్ష్యంగా పెట్టుకున్నామని పాట్నా ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. టీకాలు వేయించుకోవటానికి ఇప్పటి వరకు 108 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, స్క్రీనింగ్ అనంతరమే వ్యాక్సిన్ వేస్తామన్నారు. ట్రయల్స్లో ఇంట్రామాస్కులర్ విధానంలో 0.5 ఎం.ఎల్ మోతాదు ఇచ్చామని, అనంతరం వారిని రెండు గంటలు అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు.
రెండు నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లల్లో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పిల్లలపై ట్రయల్స్ పాట్నా, ఢిల్లీలోని ఎయిమ్స్తో పాటు నాగ్పూర్లోని మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జరుగుతున్నాయి. రెండు నుంచి 18 ఏళ్ల పిల్లలకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చించిన నిపుణుల కమిటీ అనుమతి ఇవ్వాలని డీసీజీఐ సిఫార్సు చేయటంతో అనుమతులు జారీ అయ్యాయి.
మొత్తం 525మంది వాలంటీర్లపై ఈ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల టీకాలను ఇచ్చి పరిస్థితిని పరీశీలించనున్నారు. కాగా కరోనా థర్డ్ వేవ్ తో చిన్నారులపై పెను ప్రభావం చూపుతుందని నిపుణులు చేస్తున్న సూచనలతోనే భారత్ బయోటెక్ కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందనే వార్తలువస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ, కొవాగ్జిన్ టీకాలను దేశంలో 18 ఏళ్లుపైబడిన వ్యక్తులకు టీకా డ్రైవ్లో పంపిణీ చేస్తున్నారు. కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహాయంతో అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.