Bharat Ratna 2024 : 61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజానికి ‘భారతరత్న’

61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న లభించింది. 1963 లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జాకీర్ హుస్సేన్‌‌కి ఈ పురస్కారం అందిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు పీవీకి ఈ పురస్కారం దక్కడం విశేషం.

Bharat Ratna 2024 : 61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజానికి ‘భారతరత్న’

Pv Narsimha Rao

Updated On : February 9, 2024 / 1:49 PM IST

Bharat Ratna 2024 : భారత మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్‌తో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో వెల్ల‌డించారు.

Chiranjeevi : రాజకీయాలు.. రాజకీయ నాయకుల గౌరవాన్ని పెంచారు.. అద్వానీ భారతరత్నకు అర్హులు.. చిరంజీవి ట్వీట్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. పీవీ నరసింహారావు భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా సేవలందించారు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. 1951 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా చేరిన ఆయన తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభిచారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ప్రత్యేక స్ధానం. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికై కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలలో పనిచేశారు. పీవీని ప్రధాని పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో పీవీ మాత్రమే ఆ పదవికి సరైన దిక్కయ్యారు. దివాలా తీసే స్ధాయికి చేరుకున్న ఆర్ధిక వ్యవస్థలకు పీవీ పునరుజ్జీవనం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేసారు. అందుకే పీవీని ఆర్ధిక సంస్కరణల పితామహుడు అంటారు. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమం మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే.

సోషలిస్టు నాయకుడు, దివంగత మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కి భారతరత్న

రాజకీయాల్లో క్షణం తీరిక లేకపోయినా పీవీ తన రచనా వ్యాసంగాన్ని విడిచిపెట్టలేదు. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘వేయిపడగలు’కు హిందీ అనువాదం రాసారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ‘పన్ లక్షత్ కోన్ ఘతో’ అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో తెలుగు అనువాదం చేసారు. అనేక వ్యాసాలు రాసారు. పీవీ నర్సింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. 1970, జూలై 1 న ఆమె కన్నుమూసారు. పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. తన ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశం ఉండేదట పీవీకి. అది నెరవేరకుండానే 2004, డిసెంబర్ 23న పీవీ కన్నుమూసారు. ఆయన స్మృత్యర్ధం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు ‘పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే’ అని పేరుపెట్టారు. తాజాగా కేంద్రం దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలకు గాను అత్యున్నత పురస్కారం భారతరత్నకు ఎంపిక చేయడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.