Bypoll Results 2021 : దేశవ్యాప్తంగా 3 లోక్ సభ,29 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఇవే
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-2,2021) వెలువడ్డాయి.

Bypolls
Bypoll Results 2021 దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-2,2021) వెలువడ్డాయి. అయితే అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఆశించినంతగా రాణించలేకపోయింది.
పశ్చిమబెంగాల్– ఉప ఎన్నికలు జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లో(ఖర్దా, శాంతిపూర్, గొసాబ, దిన్హటా) తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
హిమాచల్ ప్రదేశ్- మండీ లోక్సభ సహా, మూడు అసెంబ్లీ స్థానాలకు(జుబ్బల్-కోట్కాయ్, ఫతేపుర్, అర్కీ) ఉప ఎన్నికలు జరుగ్గా..అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
కర్ణాటక- రెండు అసెంబ్లీ స్థానాలకు(హంగల్,సిండ్గీ)జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ,విపక్ష కాంగ్రెస్ చెరొక స్థానంలో విజయం సాధించాయి. హంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించగా..సిండ్గీలో బీజేపీ విజయం సాధించింది. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసిన జేడీఎస్కు డిపాజిట్ కూడా దక్కలేదు.
రాజస్థాన్– ఉపఎన్నికలు జరిగిన ధరియావాడ్, వల్లభ్నగర్ అసెంబ్లీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ విజయం సాధించింది.
బీహార్– రెండు అసెంబ్లీ స్థానాలకు(కుశేశ్వర్ అస్థాన్, తారాపుర్) ఉప ఎన్నికలు జరగ్గా.. కుశేశ్వర్ అస్థాన్లో అధికార జేడీయూ గెలిచింది. తారాపుర్లో కూడా జేడీయూ స్వల్ప ఆధిక్యంలో ఉంది.
మధ్యప్రదేశ్– మూడు అసెంబ్లీ స్థానాలు(పృథ్వీపుర్, జోబత్,రాయ్గావ్),ఖండ్వా లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగ్గా..జోబత్,పృథ్వీపుర్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాయ్ గావ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఖండ్వా లోక్ సభ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది.
అసోం-మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు(థోవ్రా, భవానీపుర్, మరియాని,గోసెన్ గావ్, తముల్పుర్) ఉప ఎన్నికలు జరుగ్గా..థోవ్రా, భవానీపుర్, మరియానిలో అధికార బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో రెండు స్థానాలు గోసెన్ గావ్, తముల్పుర్లో బీజేపీ మిత్రపక్షం యూడీడీఎప్ అభ్యర్థులు విజయం సాధించారు.
మిజోరం– తూయిరియాల్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో అధికార మిజోనేషనల్ ఫ్రంట్ అభ్యర్థి విజయం సాధించారు.
హర్యానా– ఎల్లెనాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఐఎన్ఎల్డీ(ఇండియన్ నేషనల్ లోక్ దల్) అభ్యర్థి అభయ్ చౌతాలా భాజపా అభ్యర్థి గోబింద్ ఖండాపై 6739 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మేఘాలయ-మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా.. రాజబలలో అధికార ఎన్పీపీ విజయం సాధించింది. మారింగ్నెగ్లో కూడా ఎన్పీపీ ముందంజలో ఉంది. మాపలాంగ్లో యూడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్- బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
తెలంగాణ– హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు.
కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ లోక్సభ స్థానంలో శివసేన అభ్యర్థి కలాబెన్ దేల్కర్ 51,269ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ALSO READ Rahul Gandhi – Virat Kohli: విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తున్న రాహుల్ గాంధీ