కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. సీల్డ్ కవరులో స్టేటస్ రిపోర్టు

పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన సీబీఐ అలాగే ఘటనాస్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది.

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. సీల్డ్ కవరులో స్టేటస్ రిపోర్టు

Updated On : August 22, 2024 / 6:03 PM IST

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో సుప్రీంకోర్టులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సీల్డ్ కవరులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ అధికారులు నివేదికలో పొందుపర్చారు. పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన సీబీఐ అలాగే ఘటనాస్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది.

ఇప్పటి వరకు ఎంతమందిని ప్రశ్నించి, ఏ మేరకు సమాచారం రాబట్టామన్నది కూడా సుప్రీంకోర్టుకు నివేదికలో తెలిపింది. కాగా, వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆ ఘటనపై దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, వైద్యులు పలు రంగాల వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు.

ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ కార్యాలయానికి ఆర్జీకార్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చేరుకున్నారు. వారం రోజులుగా సందీప్ ఘోష్ ను సీబీఐ ప్రశ్నిస్తోంది. డాక్టర్ హత్యాచార ఘటన కేసును వివిధ కోణాల్లో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

కాగా, ఈ నెల 9న రాత్రి పశ్చిమ బెంగాల్‌ ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్ డాక్టర్ 36 గంటల నైట్ షిఫ్ట్‌లో పనిచేసింది. సెమినార్ హాల్‌లో విశ్రాంతి తీసుకుందామని వెళ్లిన ఆమె ఉదయానికి విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్ల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Vijay : పార్టీ జెండాని ఆవిష్కరించిన విజయ్.. ఇదే విజయ్ పార్టీ జెండా.. ఇక తమిళ రాజకీయాల్లో దూకుడు..