Varun Gandhi: ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వని స్కూల్ యాజమాన్యం.. ఏడ్చిన బాలిక.. బీజేపీ ఎంపీ స్పందన ఇదే
స్కూలు ఫీజు కట్టలేదని ఒక చిన్నారిని పరీక్షకు అనుమతించలేదు ప్రైవేటు స్కూలు యాజమాన్యం. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటనను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.

Varun Gandhi: స్కూలు, కాలేజీల్లో ఫీజులు చెల్లించకుంటే పరీక్ష రాయనివ్వకపోవడం, కొన్నిసార్లు క్లాసులకు అనుమతించకపోవడం జరుగుతుంటుంది. ఇది చాలా మామూలు విషయమే అని చూసి వదిలేస్తుంటారు చాలా మంది.
కానీ, బీజేపీ ఎంపీ మాత్రం ఈ అంశంపై స్పందించారు. ఉత్తర ప్రదేశ్, ఫిల్బిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన వరుణ్ గాంధీ దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, ఉన్నావ్ జిల్లాకు చెందిన ఒక చిన్నారి స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుతోంది. అయితే, ఆ చిన్నారి స్కూలు ఫీజు చెల్లించలేదని పరీక్షకు అనుమతించలేదు. దీంతో తనను స్కూల్ ఫీజు కట్టనందుకు పరీక్ష రాయనివ్వలేదని ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది. దీనికి సంబంధించిన వీడియోనే వరుణ్ గాంధీ షేర్ చేశారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘‘దేశంలో ఫీజులు చెల్లించలేక వివక్షకు గురవుతున్న లక్షలాది మంది విద్యార్థుల బాధకి ఈ చిన్నారి కన్నీళ్లు నిదర్శనం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నారులు విద్యకు దూరమవ్వకుండా చూడటం అధికారులతోపాటు, సమాంజలోని ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా అధికారులు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలి’’ అని వరుణ్ గాంధీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
इस बेटी के आंसू उन लाखों बच्चों की संयुक्त पीड़ा बता रहे हैं जिन्हें फीस न जमा होने के कारण उपहास झेलना पड़ता है।
आर्थिक तंगी बच्चों की शिक्षा में रोड़ा ना बने यह हर जिले के अधिकारियों व जनप्रतिनिधियों की नैतिक जिम्मेदारी है।
निजी संस्थान मानवता न भूलें, शिक्षा व्यापार नहीं है। pic.twitter.com/GZL9RwSICB
— Varun Gandhi (@varungandhi80) October 18, 2022