Ayushman Bharat : 70 ఏళ్లు పైబడిన పెద్దలకు రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎవరు అర్హులు, బెనిఫిట్స్ ఏంటి? ఎలా దరఖాస్తు చేయాలి?

Ayushman Bharat : ఆదాయంతో సంబంధం లేకుండా 70ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

Ayushman Bharat : 70 ఏళ్లు పైబడిన పెద్దలకు రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎవరు అర్హులు, బెనిఫిట్స్ ఏంటి? ఎలా దరఖాస్తు చేయాలి?

health insurance under Ayushman Bharat

Updated On : October 29, 2024 / 4:45 PM IST

Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్‌ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి మోదీ శ్రీకారం చుట్టారు. ఏబీ పీఎం-జేఏవై ప్రయోజనాలు 70 పైబడిన సీనియర్ సిటిజన్‌లందరికీ వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటాయి.

ఈ పథకం కింద అర్హత పొందిన సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేకమైన కార్డ్ అందిస్తారు. ఆరోగ్య రంగానికి చెందిన అభివృద్ధి కార్యక్రమాలు, చిన్నారులు, గర్భిణుల వ్యాక్సినేషన్‌ కోసం యూ-విన్‌ పోర్టల్‌ (U-WIN)ను కూడా ప్రారంభించారు. 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఇతర సీనియర్ సిటిజన్లందరూ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు బీమాను పొందుతారు.

ఇతర ఆరోగ్య బీమా :
సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS), ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ల ప్రయోజనాలను ఇప్పటికే పొందుతున్న 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లు వారి ప్రస్తుత స్కీమ్ ఎంచుకోవచ్చు లేదా ఏబీ పీఎంజేఏవై స్కీమ్ కూడా ఎంచుకోవచ్చు.

ప్రైవేట్ ఆరోగ్య బీమా :
ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదా ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ పథకం కింద ఉన్న 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లు ఈ ఏబీ పీఎం-జేఏవై కింద ప్రయోజనాలను పొందేందుకు అర్హులు.

ఆయుష్మాన్ భారత్ : ఎవరికి లాభం? :
కుటుంబ ప్రాతిపదికన రూ. 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమా కవరేజీతో పాటు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లతో సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు బీమా ప్రయోజనాలను అందించనుంది.

ఏబీ పీఎం-జేఏవై స్కీమ్ వివరాలు :
పీఐబీ విడుదల ప్రకారం.. “ఏబీ పీఎం-జేఏవై స్కీమ్ కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. భారత జనాభాలో దిగువన ఉన్న 40శాతం మందిలో 10.74 కోట్ల పేద, బలహీన కుటుంబాలు ఈ పథకం కింద అర్హులుగా ఉంటారు. 2022 జనవరిలో ఏబీ పీఎం-జేఏవై కింద లబ్ధిదారుల స్థావరాన్ని 10.74 కోట్ల నుంచి 12 కోట్ల కుటుంబాలకు సవరించింది. 2011 జనాభా కన్నా భారత్ దశాబ్ద జనాభా పెరుగుదల 11.7శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 37 లక్షల మంది ఆశాలు/ఏడబ్ల్యూడబ్ల్యూలు/ఏడబ్ల్యూహెచ్‌లు వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య ప్రయోజనాల కోసం పథకాన్ని విస్తరించింది. ఈ మిషన్‌‌లో భాగంగా ఏబీ పీఎం-జేఏవై ఇప్పుడు దేశవ్యాప్తంగా 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల పౌరులందరికీ రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తుంది.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి

  • అధికారిక వెబ్‌సైట్ https://abdm.gov.in/ ని సందర్శించండి
  • అర్హత ఉన్న వ్యక్తి మీ ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్‌ని (PMJAY) కియోస్క్‌లో ధృవీకరించాలి
  • కుటుంబ గుర్తింపు రుజువులను సమర్పించండి
  • మీ ఇ-కార్డ్ పొందండి. ఈ కార్డు ప్రత్యేకమైన ఏబీ-పీఎంజేఏవై ఐడీ కలిగి ఉంటుంది.
  • పీఎంజేఏవై పోర్టల్‌లో ‘Am i eligible‌’ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
  • beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్‌ అవుతారు.
  • క్యాప్చా, మొబైల్‌ నంబర్‌, ఓటీపీ ఎంటర్‌ చేయాలి.
  • కేవైసీకి మీ వివరాలు ఎంటర్ చేశాక ఆమోదం కోసం చూడాలి.
  • ఆయుష్మాన్‌ కార్డు జనరేట్ అవుతుంది.
  • అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును డౌన్‌లోడ్‌ చేయ్చు.
  • ఆధార్‌లో నమోదైన వయసు ఆధారంగా అప్లయ్ చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కవరేజ్ కింద ఈ పథకం అన్ని ఖర్చులను కవర్ చేస్తుంది.

  • వైద్య పరీక్షలు, చికిత్స, సంప్రదింపులు.
  • ప్రీ-హాస్పిటలైజేషన్ కేర్, అడ్మిట్ అయ్యే 3 రోజుల ముందు వరకు
  • మందులు, వైద్య వినియోగ వస్తువులు.
  • నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ (ఐసీయూ కేర్).
  • రోగనిర్ధారణ, ల్యాబ్ రిపోర్టులు
  • అవసరమైతే మెడికల్ ఇంప్లాంట్లు.
  • ఆసుపత్రిలో ఉన్న సమయంలో వసతి, ఆహార సేవలు.
  • చికిత్స సమయంలో తలెత్తే సమస్యలు.
  • డిశ్చార్జ్ అయిన 15 రోజుల వరకు

Read Also : Naim Qassem : హసన్ నస్రల్లా స్థానంలో హిజ్బుల్లా కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్ ఎన్నిక