క్వారంటైన్ లో భర్త…ప్రియుడితో లేచిపోయిన భార్య

భర్త క్వారంటైన్ లో ఉండగా భార్య ప్రియుడితో లేచిపోయిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఛత్తర్ పూర్ జిల్లా ముందేరి గ్రామానికి చెందిన యాబై ఏళ్ల వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీకి వలస వెళ్లాడు. ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో కూలీ పని చేస్తున్నాడు. అతని భార్యా పిల్లలు కూడా ఢిల్లీలోనే ఉండేవారు.
ఏడాదిన్నర క్రితం భార్యాపిల్లలు ముందేరికి తిరిగి వచ్చారు. భర్త ఢిల్లీలోనే ఉన్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో అతను సొంతూరు ముందేరికి రావాలనుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలులో మే19వ తేదీన ఢిల్లీ నుంచి ఛత్తర్ పూర్ జిల్లాకు చేరుకున్నారు.
కరోనా నిబంధనల ప్రకారం అతను తన ఇంట్లోని పై అంతస్తులో 14 రోజులు క్వారంటైన్ లోకి వెళ్లాడు. అతని భార్యాపిల్లలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మే 24వ తేదీ భార్య ఎవరికీ చెప్పకుండా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.
భర్త ఉన్న గదికి బయటి నుంచి తాళం వేసింది. భర్త గది నుంచి బయటకు వచ్చి భార్య అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.