ఆడోళ్లు కూడా ఇంతలా ఏడవరు : మళ్లీ ఏడ్చిన కుమారస్వామి

కర్ణాటక సీఎం కుమారస్వామి మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆగవాళ్లు కూడా ఇంతలా మాటిమాటికి ఏడ్వరేమో అనే విధంగా కుమారస్వామి నెలకొకసారి అయినా కన్నీళ్లు పెట్టుకోవడంపై కర్ణాటక ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. అసలు కర్ణాటక సీఎం కుమారస్వామా, సిద్దరామయ్య అనే సందేహాం ఇప్పటికీ క్ననడ ప్రజల్లో నెలకొంది. కుమారస్వామిని కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కచేయడం లేదన్న భావన జేడీఎస్ నేతల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఉంది. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపిన కుమారస్వామి కాంగ్రెస్ రాజకీయాలకు పదే పదే కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తాను రాష్ట్రానికి మఖ్యమంత్రిలా కాకుండా ఓ సాధారణ క్లర్క్ లా పనిచేస్తున్నానని జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో కుమారస్వామి కన్నీటిపర్యంతమైనట్లు జేడీెస్ నేతలు తెలిపారు. కుమారస్వామితో కాంగ్రెస్ నేతలు బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని..వేరే దారి లేక కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు చేయాల్సి వస్తోందని..కుమారస్వామి భావోద్వేగంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు జేడీఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై కొంతవరకూ వేచి చూసే ధోరణితో వ్యవహరిద్దామని సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సూచించినట్టు తెలుస్తోంది.ఇటీవల కాలంలో నెలకొకసారైనా పబ్లిక్ మీటింగ్స్ లో కన్నీళ్లు పెట్టుకుంటున్న కుమారస్వామిని చూసి ప్రతిపక్ష బీజేపీ నేతలు కూడా భాధపడుతున్నారు.