కేరళ వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా

దేశంలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్కు కరోనా సోకింది. మంగళవారం చేయించుకున్న పరీక్షలో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది.
మంత్రి వీఎస్ సునీల్ కుమార్ తో పాటు ఆయన గన్మెన్కు కూడా వైరస్ సోకింది. మంత్రితో పాటు ఆయన సిబ్బందిని స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు డాక్టర్లు.
కాగా, కేరళ కేబినెట్లో వైరస్ బారిన పడిన మూడో మంత్రి సునీల్ కుమార్. అంతకు ముందు పరిశ్రమలు, క్రీడల శాఖ మంత్రి ఈపీ జయరాజన్, ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్కు మహమ్మారి సోకింది.
.