Ladakh : ఎట్టకేలకు రాష్ట్ర పక్షి,జంతువుని ప్రకటించిన లడఖ్

సుదీర్ఘంగా సాగిన విభజన పంచాయతీకి తెరపడింది. రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు వివరాలపై లడఖ్ యంత్రాంగం సృష్టతనిచ్చింది.

Ladakh : ఎట్టకేలకు రాష్ట్ర పక్షి,జంతువుని ప్రకటించిన లడఖ్

Ladakh

Ladakh  సుదీర్ఘంగా సాగిన విభజన పంచాయతీకి తెరపడింది. రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు వివరాలపై లడఖ్ యంత్రాంగం సృష్టతనిచ్చింది. 2019 లో జమ్ము కశ్మీర్ కి కేంద్రం ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత…ఇవి జమ్ము కశ్మీర్,లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. దీంతో అక్కడి ప్రభుత్వ ఆస్తులను సమానంగా పంచాల్సిన బాధ్యత అధికారులపై పడింది. వీటితో పాటే రాష్ట్ర జంతువు, రాష్ట్ర పక్షిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రక్రియ 2019 చివర్లో ప్రారంభం కాగా.. ఎట్టకేలకు మంగళవారం ఓ కొలిక్కి వచ్చింది.

స్థానికంగా ఎక్కువగా కనిపించే మంచు చిరుతను రాష్ట్ర జంతువుగా, లడఖ్ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే నల్ల మెడ కలిగిన కొంగను రాష్ట్ర పక్షిగా గుర్తించినట్లు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్​కే మాథుర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పక్షితో పాటు మంచు చిరుతలు అత్యంత అరుదైనవి. ఇవి అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి.

కాగా, మంచు చిరుతలు అత్యంత అరుదైనవి. ఇవి అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. ఈ మంచు చిరుత 2.4 మీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని ఘోస్ట్ ఆఫ్​ ది మౌంటెన్స్​గా పిలుస్తారు. లడఖ్ తో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్​ప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. మరోవైపు, రాష్ట్ర పుష్పం, వృక్షంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక,నల్ల మెడ కలిగిన కొంగ 1.35 పొడవు ఉంటుంది. 8 కిలోల వరకు బరువు పెరుగుతుంది. దీని తలపై ఎర్రటి కిరీటం లాంటి ఆకారం ఉంటుంది.  ఎక్కువగా రెండు పక్షులు కలిసి తిరుగుతాయి. ఇవి అత్యంత అరుదైనవి. ఈ కొంగ.. ఇప్పటివరకు జమ్ము కశ్మీర్ రాష్ట్ర పక్షిగా ఉండింది. మరోవైపు,రాష్ట్ర పుష్పం, వృక్షంపై లద్దాఖ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇక,కశ్మీర్ విషయానికొస్తే..దుప్పిని రాష్ట్ర జంతువుగా కొనసాగిస్తున్నారు. కశ్మీర్ దాసరిపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేసే యోచనలో ఉన్నారు. దీనికే తుది ఆమోదం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జమ్ము కశ్మీర్ రాష్ట్ర వృక్షంగా చినార్, పుష్పంగా కమలం ఉన్నాయి.