Viral Video: అత్యంత దుర్మార్గపు చర్యకు పాల్పడ్డ బీజేపీ నేత.. పబ్లిక్‭గా గిరిజన వ్యక్తి ముఖంపై మూత్రం పోస్తూ పైశాచిక ఆనందం

సిద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నేత కేదార్ నాథ్ శుక్లా గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో పబ్లిక్ ప్రదేశంలో జరిగిన ఉన్మాదపు ఘటనే ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన ట్విటర్‌లో షేర్ చేస్తూ..

Viral Video: అత్యంత దుర్మార్గపు చర్యకు పాల్పడ్డ బీజేపీ నేత.. పబ్లిక్‭గా గిరిజన వ్యక్తి ముఖంపై మూత్రం పోస్తూ పైశాచిక ఆనందం

Madhya Pradesh: అత్యంత దుర్మార్గమైన, అమానవీయమైన, అవమానకరమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాని కుదిపివేస్తోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకుడు ఒక గిరిజన వ్యక్తి మీద మూత్రం పోస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజెన్లు షేర్ చేస్తూ సదరు వ్యక్తిపై బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నేత కేదార్ నాథ్ శుక్లా గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో పబ్లిక్ ప్రదేశంలో జరిగిన ఉన్మాదపు ఘటనే ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన ట్విటర్‌లో షేర్ చేస్తూ “ఆదివాసీల ప్రయోజనాల గురించి తప్పుడు మాటలు మాట్లాడే బీజేపీ నాయకుడు ఓ గిరిజన నిరుపేదపై ఇలా విరుచుకుపడడం చాలా ఖండనీయమైన చర్య’’ అని ట్వీట్ చేశారు.


ఈ ట్వీట్‭లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ట్యాగ్ చేస్తూ “ఇదేనా మీ గిరిజన ప్రేమ? ఈ జంగిల్ రాజ్‌ని ఏమని పిలుస్తారు? ఈ బీజేపీ నాయకుడిని ఎందుకు అరెస్టు చేయలేదు? నిందితుడి పేరు ప్రవేశ్ శుక్లా. బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా నియోజకవర్గం వాడు. గిరిజన యువకులపై మూత్ర విసర్జన ఇలాంటి నిందితులు భాజపాకు చెందిన ప్రముఖ నేతలతో కలిసి తిరుగుతారు’’ అని అన్నారు.