Maharashtra Jharkhand Results : మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.. ఫలితాలపై ఉత్కంఠ!

Maharashtra Jharkhand Results : ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సన్నాహాలు పూర్తి చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Maharashtra Jharkhand Results : మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.. ఫలితాలపై ఉత్కంఠ!

Maharashtra Jharkhand Election Result 2024

Updated On : November 22, 2024 / 11:41 PM IST

Maharashtra Jharkhand Election Result 2024 : మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 4136 మంది అభ్యర్థుల భవితవ్యం శనివారం (నవంబర్ 23) తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సన్నాహాలు పూర్తి చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ముందుగా పోస్ట్ ద్వారా వచ్చిన బ్యాలెట్ పేపర్లను లెక్కించనున్నారు. అనంతరం 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

ఓట్ల లెక్కింపునకు 6,500 కౌంటింగ్ టేబుల్స్ సిద్ధంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు దాదాపు 4వేలు, ఈవీఎం టేబుల్స్, 2,500 టేబుల్స్‌పై జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రం లోపలికి ఎవరిని అనుమతించరు. ప్రతి టేబుల్‌ను అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్లు సందర్శించవచ్చు. ఎన్నికల ప్రక్రియ అంతా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ట్రెండ్‌లు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటలకు ఎవరిది విజయం అనేదానిపై స్సష్టత రానుంది.

ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల చుట్టూ ప్రజలు గుమిగూడడంపై నిషేధించింది. అధికారిక వ్యక్తులను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. దీంతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఉండటంతో అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దింపారు.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు :
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగింది. నవంబర్ 20న జరిగిన ఓటింగ్‌లో చివరిగా 66.05 శాతం ఓటింగ్ నమోదు కాగా, 2019లో ఈ సంఖ్య 61.1 శాతంగా నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇందులో నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నిక కోసం ఒక కేంద్రం కూడా ఉంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాన్ని మొత్తం 288 మంది కౌంటింగ్ పరిశీలకులు పర్యవేక్షిస్తారని, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కౌంటింగ్‌ను పర్యవేక్షించేందుకు ఇద్దరు పరిశీలకులను నియమించినట్లు అధికారి తెలిపారు.

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి :
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం శనివారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు పూర్తయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ట్రెండ్‌లు మొదలవుతాయి. ఎన్నికల సంఘం ప్రకారం.. ఈసారి ఓటింగ్ రికార్డు స్థాయిలో 67.74 శాతానికి చేరుకుంది. నవంబర్ 15, 2000న రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధికం. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేర్వేరుగా పరిశీలకులను నియమించారు. పోస్టల్ బ్యాలెట్ల నిష్పక్షపాత లెక్కింపునకు ప్రతి టేబుల్‌కి ఒక ఎఆర్ఓను నియమించారు. నవంబర్ 13, 20 తేదీల్లో రాష్ట్రంలో 2 దశల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 81 స్థానాలకు గానూ తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగగా, రెండో దశలో 38 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది.

కౌంటింగ్ సన్నాహాలు పూర్తి, భద్రత కట్టుదిట్టం :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకారం.. 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు 288 కౌంటింగ్ కేంద్రాలు, నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఒక కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు 288 మంది కౌంటింగ్ ఇన్‌స్పెక్టర్లను, నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇద్దరు కౌంటింగ్ ఇన్‌స్పెక్టర్లను నియమించారు.

సీల్ చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలకుల సమక్షంలో తెరిచి, హాజరైన అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు, ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు. ఈసారి ఎన్నికల్లో మొత్తం 66.05 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోని 6 కోట్ల 40 లక్షల 88 వేల 195 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు అప్‌డేట్‌ను ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయనుంది.

Read Also : రాజకీయాల్లో రాములమ్మ మళ్లీ యాక్టివ్‌ కాబోతున్నారా? ఆమె కాంగ్రెస్ సర్కార్‌లో ఏదైనా పదవిని ఆశిస్తున్నారా?