PM Modi – Jupally Rameshwar Rao : ప్రధాని మోదీని కలిసిన మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు
PM Modi – Jupally Rameshwar Rao : జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. గౌరవానికి గుర్తుగా శాలువాతో ఆయన్ను సత్కరించారు.

my home group chairman dr jupally rameswar rao his son ramu rao meet pm modi
PM Modi – Jupally Rameshwar Rao : మై హోమ్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్, డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అయిన ఆయన కుమారుడు జూపల్లి రామురావు ఈరోజు (నవంబర్ 7న) ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.పర్యటన సందర్భంగా జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు.
గౌరవానికి గుర్తుగా శాలువాతో ఆయన్ను సత్కరించారు. అలాగే, కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రధానమంత్రికి బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా మోదీతో కొంత సమయం పాటు పలు విషయాలపై ముచ్చటించారు. దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.

my home group chairman
ప్రధాని మోదీ ఆధ్యాత్మిక విలువలతో పాటు దయాదాక్షిణ్యాల పట్ల బలమైన నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వ శైలితో పాటు ప్రజాసేవ పట్ల అంకితభావాన్ని కలిగి ఉన్నారు. సమానత్వంపై మోదీ దృక్పథం దేశం పట్ల ఆయన విజన్ రూపొందించింది.

my home group chairman
ఈ సెంటిమెంట్కు అనుగుణంగా 2022లో హైదరాబాద్లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 11వ శతాబ్దపు సమాతామూర్తి శ్రీ రామానుజాచార్యులవారి గౌరవార్థం శ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ముచ్చింతల్లో ఈ విగ్రహాన్ని రూపొందించారు.

my home group chairman
ఇటీవల న్యూయార్క్లో జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ.. మానవ-కేంద్రీకృత విధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మోదీ విలువలతో భారత్ పట్ల ఆయన విజన్ ఎందరికో మార్గనిర్దేశం చేశారు. ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసే నేతగా ఒకవైపు వ్యక్తిగత వినయంతో ఆధ్యాత్మికంగానూ రాజకీయంగానూ మొదటి స్థానంలో నిలిచారు. దాంతో ప్రపంచంలోనే బలమైన నేతగా మోదీ ఎదిగారు.