Modi-Putin : అప్ఘాన్ పరిస్థితులపై 45 నిమిషాలు ఫోన్ లో మాట్లాడుకున్న మోదీ-పుతిన్

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ఫోన్ చేశారు.

Modi-Putin : అప్ఘాన్ పరిస్థితులపై 45 నిమిషాలు ఫోన్ లో మాట్లాడుకున్న మోదీ-పుతిన్

Modi Putin

Updated On : August 24, 2021 / 3:58 PM IST

Modi-Putin   ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ఫోన్ చేశారు. తాలిబన్ల ఆక్రమణతో అప్ఘానిస్తాన్ లో తలెత్తిన సంక్షోభంపై ఇరు దేశాధినేతలు చ‌ర్చించుకున్నారు. దాదాపు 45 నిమిషాల‌పాటు వారి మ‌ధ్య ఫోన్ సంభాష‌ణ కొన‌సాగింది. ఆ 45 నిమిషాల్లో వారు పూర్తిగా ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితుల‌ గురించే చ‌ర్చించుకున్నట్లు ప్ర‌ధాని కార్యాల‌య‌ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

పుతిన్ తో ఫోన్ సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో..అప్ఘానిస్తాన్​లో పరిణామాలపై నా మిత్రుడు పుతిన్​తో అభిప్రాయాలు పంచుకున్నా. ద్వైపాక్షిక అజెండా, కొవిడ్​ పై పోరులో భారత్- రష్యా మధ్య భాగస్వామ్యం గురించి కూడా చర్చించాం. ముఖ్యమైన విషయాలపై ఇరువురూ సంప్రదింపులు జరుపుకోవాలని అంగీకరించుకున్నట్లు తెలిపారు.

ఇక, సోమవారం జర్మనీ ఛాన్స్​లర్ ఏంజెలా మెర్కెల్​తోనూ మోదీ చర్చలు జరిపారు. అప్ఘాన్ సంక్షోభంపై నేతలిద్దరూ మాట్లాడుకున్నారని పీఎంఓ తెలిపింది. అఫ్గాన్​లో శాంతిభద్రతలు కాపాడటం కీలకమని ఇరువురు పేర్కొన్నట్లు పీఎంఓ ప్రకటనలో వెల్లడించింది. అక్కడ చిక్కుకున్నవారిని రప్పించేందుకు నేతలు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది.

కాగా, భార‌త్.. ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి పేరుతో ఆఫ్ఘ‌ాన్ నుంచి భార‌తీయుల‌ను స్వదేశానికి తీసుకొస్తున్న‌ విషయం తెలిసిందే. అప్ఘాన్​ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్న మరునాడు ఆగస్టు 16 నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. భారత్​ ఇప్పటివరకు 800కిపైగా మందిని అప్ఘానిస్తాన్ నుంచి తీసుకొచ్చింది. వీరిలో భారతీయులతో పాటు అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నారు.