Delhi Restaurant Seal : కోవిడ్ రూల్స్ బ్రేక్.. పాపులర్ రెస్టారెంటుకు తాళం.. ఎఫ్ఐఆర్ నమోదు!

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.

Delhi Restaurant Seal : కోవిడ్ రూల్స్ బ్రేక్.. పాపులర్ రెస్టారెంటుకు తాళం.. ఎఫ్ఐఆర్ నమోదు!

Popular South Delhi Restaurant Sealed For Breaking Covid Rule, Case Filed

Updated On : December 24, 2021 / 1:13 PM IST

Delhi Restaurant Seal : దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. పండుగ సీజన్ కావడంతో కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు విధించాల్సిందిగా సూచనలు చేసింది. దేశ రాజధానిలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) మార్గదర్శకాలను జారీచేసింది. భారీ సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ, DDMA మార్గదర్శకాలను ఉల్లంఘించిన దక్షిణ ఢిల్లీలోని పాపులర్ రెస్టారెంట్‌కు సీల్ వేశారు అధికారులు. కోవిడ్ నిబంధనలు పాటించడంపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో DDMA అధికారులు మెహ్రౌలీలోని డయాబ్లో రెస్టారెంటు కోవిడ్ రూల్స్ అతిక్రమించినట్టు గుర్తించారు.

DDMA ఆదేశాల దృష్ట్యా నిర్వహించిన వరుస తనిఖీల్లో భాగంగా మెహ్రౌలీలోని డయాబ్లో రెస్టారెంట్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో రెస్టారెంట్ కోవిడ్ రూల్స్ అతిక్రమించినట్టు గుర్తించి సీల్ వేసినట్టు జిల్లా మేజిస్ట్రేట్ సోనాలికా జివానీ తెలిపారు. గురువారం రాత్రి 10:45 గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌లో దాదాపు 600 మంది ఉన్నారు. కోవిడ్ ఉద్భవిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో.. కోవిడ్ ప్రోటోకాల్‌లను పూర్తిగా ఉల్లంఘిస్తూ రెస్టారెంట్ ఈవెంట్‌ను నిర్వహించిందని జివానీ పేర్కొన్నారు. రెస్టారెంటులోని మొత్తం జనాన్ని తహసీల్దార్ (మెహ్రౌలీ) బయటకు పంపించేశారు. DDMA మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు వెంటనే రెస్టారెంటుకు అక్కడికక్కడే సీలు చేశారు. Ms జీవాని చెప్పారు.

ఐపిసిలోని సెక్షన్ 188, 269 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) ఎం హర్షవర్ధన్ తెలిపారు. రెస్టారెంట్‌పై ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో డయాబ్లో కేసు నమోదైంది. కరోనావైరస్ కేసుల దృష్ట్యా, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) నగరంలో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి ఎలాంటి సమావేశాలు జరపొద్దని జిల్లా మేజిస్ట్రేట్‌లను ఆదేశించింది. రెస్టారెంట్లు బార్‌లు సీటింగ్ కెపాసిటీలో 50 శాతం మాత్రమే అనుమతినిచ్చింది. గరిష్టంగా 200 మంది వ్యక్తులతో వివాహ వేడుకలకు అనుమతినిచ్చింది.

Read Also : New Film Releases: టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. వర్రీ అవుతున్న హీరోలు!