Prashant Kishor: ముఖ్యమంత్రి సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ రాజీనామా
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 'ప్రధాన సలహాదారు' పదవికి రాజీనామా చేశారు.

Prashanth
Prashant Kishor: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ‘ప్రధాన సలహాదారు’ పదవికి రాజీనామా చేశారు. ప్రశాంత్ కిషోర్ ఈ సంవత్సరం ముఖ్యమంత్రి అమరీందర్కు ‘ప్రిన్సిపల్ అడ్వైజర్’గా నియమితులయ్యారు. వచ్చే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారకర్తగా పనిచేశారు.
ప్రశాంత్ కిషోర్ ఏమి చెప్పారు ?
“తన నిర్ణయం గురించి సమాచారం ఇస్తూ, ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్తో మాట్లాడారు. “ప్రజా జీవితంలో చురుకైన పాత్ర నుంచి తాత్కాలిక సెలవు తీసుకోవాలనే నా నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, మీకు ‘ప్రిన్సిపల్ అడ్వైజర్’ గా నేను బాధ్యతలు నిర్వహించలేకపోతున్నాను. దయచేసి ఈ బాధ్యత నుంచి నన్ను విడిపించమని అభ్యర్థిస్తున్నాను. ఇప్పటికైతే నా భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, నన్ను నా విధుల్లో నుంచి రిలీవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.’ అని సీఎంకు రాసిన లేఖలో ప్రశాంత్ కిశోర్ అభ్యర్థించారు.
అయితే, రాజకీయ సమీకరణాలను పరిష్కరించే పనిని తన iPac టీమ్ చేస్తోందని ప్రశాంత్ కిషోర్ చెప్పడం గమనార్హం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని ప్రకటించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ భవిష్యత్ కార్యాచరణపై ఎటువంటి స్పష్టతనివ్వలేదు ప్రశాంత్ కిషోర్. అయితే ఆయన వేస్తున్న అడుగులను గమనిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలతో వరుసగా భేటీలు, 2024 నాటికి బీజేపీ వ్యతిరేకత విపక్షాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రశాంత్ కిషోర్ వస్తారని ఎదరుచూస్తుంది. ఆయన రాక వల్ల కాంగ్రెస్ లాభపడుతుందని చాలా మంది కాంగ్రెస్ నాయకులు విశ్వసించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ జూలై 22 న సమావేశాన్ని ఏర్పాటు చేశారని, ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే అతనికి ఇవ్వాల్సిన పాత్ర గురించి చర్చించినట్లుగా చెబుతున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ అధికారికంగా కాంగ్రెస్లో చేరే విషయాన్ని ప్రకటించలేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలతో భేటీలో పీకే కాంగ్రెస్లో చేరే అంశం చర్చకు వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.