Railway : రైలు ప్రయాణికులకు అలర్ట్.. రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత
రైలు ప్రయాణికులకు అలర్ట్. రిజర్వేషన్ చేసుకోవాలని అనుకుంటున్న వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. రైల్వే రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా

Railway
Railway : రైలు ప్రయాణికులకు అలర్ట్. రిజర్వేషన్ చేసుకోవాలని అనుకుంటున్న వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. రైల్వే రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ నెల 21 నుంచి పలు సమయాల్లో రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఈ విషయాన్ని తెలిపారు.
ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో డిజాస్టర్ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం చార్టింగ్, కరెంట్ బుకింగ్, టికెట్ రద్దు, పీఆర్ఎస్ ఎంక్వైరీ, చార్జీలు వాపసు పొందడం వంటి పీఆర్ఎస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. కాబట్టి ఈ సమయంలో టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ముందుగానే బుక్ చేసుకోవడం ఉత్తమం.
* ఈ నెల 21వ తేదీ రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు
* తిరిగి 22వ తేదీ రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు నిలిచిపోతాయి.
* ఈ వేళల్లో ప్రారంభమయ్యే అన్ని రైళ్ల మెయిన్ చార్టులు, కరెంట్ బుకింగ్ చార్టులు ముందుగానే సిద్ధం చేయనున్నారు.