అయ్యప్ప భక్తులతో 480 కి.మీ. నడిచిన కుక్క.. వీడియో

  • Published By: veegamteam ,Published On : November 18, 2019 / 05:50 AM IST
అయ్యప్ప భక్తులతో 480 కి.మీ. నడిచిన కుక్క.. వీడియో

Updated On : November 18, 2019 / 5:50 AM IST

అయ్యప్ప మాలా వేసుకుని కాలినడకన స్వామివారి దగ్గరకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు ఎదురైన కొత్త అనుభవం వింటే ఆశ్చర్యపోతారు. ఓ శునకం.. అయ్యప్ప భక్తులతో 480 కిలోమీటర్లు నడిచిందట. ఆంధ్రప్రదేశ్‌ తిరుమలలో అక్టోబర్‌ 31వ తేదీన 13 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు కాలినడకన బయల్దేరారు. వారితో పాటుగా నడక మొదలుపెట్టన ఆ శునకం మార్గం మధ్యలో వెళ్లిపోతుందేమో అనుకున్నారట.

కానీ వాళ్లు నడుస్తున్నా కొద్ది ఆ కుక్క కూడా వారితో నడుస్తూనే ఉందట. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ.. మేము మా యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు తాము 480 కిలోమీటర్లు నడిచామని.. వారితో పాటుగా ఆ కుక్క కూడా అన్ని కిలో మీటర్లు నడిచిందని తెలిపారు. తాము తెచ్చుకున్న ఆహారాన్ని ఆ కుక్కకు కూడా పెట్టామని చెప్పారు.

ప్రతి ఏడాది శబరిమలకు కాలినడకన చాలామంది భక్తులు వెళ్తుంటారు. ఇలాంటి వింత అనుభవం ఎప్పుడు ఎవరికి జరగుండదు. కానీ మాకు ఈ కుక్క తమ వెంట నడక సాగించడం చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.