Bihar Politics: ఇండియా కూటమికి చెక్ పెడతారా? నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ ప్లానేంటి?

ఈ సమావేశాల అనంతరం లాలూ ప్రసాద్‌ పార్టీ ఆర్జేడీ నేతలు శుక్రవారం నితీశ్‌ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి రాజకీయాలను వేడెక్కించారు. విపక్షాల కూటమి ఇండియాలో చేరిన పార్టీల నేతల ఈ ర్యాపిడ్‌ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు అర్థాలు దొర్లుతున్నాయి. మహాకూటమిలో సీట్ల పంపకాల విషయంలో క్లారిటీ లేకపోవడంతో అన్ని పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయని చెబుతున్నారు

Bihar Politics: ఇండియా కూటమికి చెక్ పెడతారా? నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ ప్లానేంటి?

Lalu and Nitish Meet: ఇండియా కూటమి ఏర్పాటు ఆజ్యం పోయడమే కాకుండా, అందరినీ ఏకం చేసి కూటమి కూర్పులో ప్రధాన పాత్ర పోషించిన బిహార్ నేతలు ఇప్పుడదే కూటమికి మంట పెడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి కారణం, తాజాగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నట్టుండి సమావేశం అయ్యారు. దాదాపు గంటపాటు చర్చలు చేశారు. ఈ సమావేశం ముగిసిందో లేదో నితీశ్ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ లాలూ పార్టీ అయిన ఆర్జేడీకి చెందిన నేతలు ప్రకటనలు గుప్పించారు.

వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య రాకపోకలు, రాయబారాలు సర్వసాధారణం. అయితే బిహార్ నేతలు మరీ తొందరగా అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో జేడీయూ, ఆర్జేడీల మధ్య సమావేశాలు బాగా పెరిగాయి. బుధవారం రబ్రీదేవి ఇంటికి నితీశ్ కుమార్ వెళ్లి కలిశారు. ఆ మరుసటి రోజే అంటే గురువారం స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని నితీశ్ ను కలిశారు. రెండు సందర్భాల్లో ఇరు నేతలు సుదీర్ఘంగానే మంతనాలు జరిపారు.

ఈ సమావేశాల అనంతరం లాలూ ప్రసాద్‌ పార్టీ ఆర్జేడీ నేతలు శుక్రవారం నితీశ్‌ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి రాజకీయాలను వేడెక్కించారు. కాగా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా బుధవారం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌తో సమావేశమై కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయడంపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీయేమో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే నితీశ్ ముందుకు వస్తే అందరికి కంటే ముందు కాంగ్రెస్ వ్యతిరేకించొచ్చని అంటున్నారు. బిహార్ నేతలు దీనిపై ఒత్తిడి చేస్తే కూటమిలో చీలికలు రావొచ్చని కూడా అంటున్నారు.

Suicide Blasts in Pakistan: బాంబు పేలుళ్లతో వణికిపోయిన పాకిస్థాన్.. గంటల వ్యవధిలో రెండు ఆత్మాహుతి దాడులు, 60 మంది మృతి

ఇక దీనితో పాటు కూటమిలో సీట్ల పంపకాలపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. విపక్షాల కూటమి ఇండియాలో చేరిన పార్టీల నేతల ఈ ర్యాపిడ్‌ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు అర్థాలు దొర్లుతున్నాయి. మహాకూటమిలో సీట్ల పంపకాల విషయంలో క్లారిటీ లేకపోవడంతో అన్ని పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయని చెబుతున్నారు. సీట్లు విభజించాలని అన్ని పార్టీలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీట్ల పంపకం విషయంలో అంధకారం నెలకొందని ఆర్జేడీ నేత ఒకరు అజ్ఞాతంలో ఉన్నారు. ఆర్జేడీ, జేడీయూలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో తెలియని అయోమయంలో ఉన్నాయన్నారు.