Tamil Nadu: రైలు ఢీకొని ముగ్గురు చిన్నారుల మృతి

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు పిల్లలు మరణించారు. చెంగల్‌పట్టులోని ఉరపాక్కం రైల్వే స్టేషన్‌లో మంగళవారం రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు చిన్నారులను రైలు ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.....

Tamil Nadu: రైలు ఢీకొని ముగ్గురు చిన్నారుల మృతి

hit by train

Updated On : October 25, 2023 / 8:08 AM IST

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు పిల్లలు మరణించారు. చెంగల్‌పట్టులోని ఉరపాక్కం రైల్వే స్టేషన్‌లో మంగళవారం రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు చిన్నారులను రైలు ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ముగ్గురు పిల్లలలో ఇద్దరు బధిరులు. మృతుల్లో వినికిడి లోపం ఉన్న 15 ఏళ్ల సురేష్, బధిర వైకల్యంతో 10 ఏళ్ల రవి, లాంగ్ వీకెండ్‌ను కుటుంబ సభ్యులతో గడపడానికి ఉరపాక్కంలో ఉన్న 11 ఏళ్ల మంజునాథ్‌గా గుర్తించారు.

Also Read : Bird Flu : అంటార్కిటికా ప్రాంతంలో మొట్టమొదటి సారి బర్డ్ ఫ్లూ ముప్పు

రైలు పట్టాల దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారని, రైలు ఢీకొట్టడంతో పట్టాలు దాటేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. బీచ్ స్టేషన్ -చెంగల్పట్టు మధ్య నడిచే సబ్ అర్బన్ రైలు పిల్లలను ఢీకొంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని రైల్వే పోలీసులు తెలిపారు. గుడువాంచెరి పోలీసులు, రైల్వే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ట్రాక్‌పై నుంచి బయటకు తీశారు.

Also Read : Jailer Actor arrest : జైలర్ మూవీ విలన్ వినాయకన్ అరెస్ట్…ఎందుకంటే…

ఈ ఘటనతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ రైలు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.