Tamil Nadu : ఒంటెద్దు బండిపై మాజీ మంత్రి చక్కర్లు, పాపం మూగజీవం ఏం చేసింది..? అంటూ సెటైర్లు
మాజీ మంత్రి జయకుమార్ ఒంటెద్దుపై ప్రయాణించారు. ఇదేనా ప్రభుత్వం తీరు అంటూ విరుచుకుపడ్డారు.

tamil nadu former minister D Jayakumar
tamil nadu D Jayakumar rode bullock cart : తమిళనాడులో మాజీ మంత్రి జయకుమార్ చెన్నై నగరంలో ఒంటెద్దు బండిపై ప్రయాణించారు. డీఎంకే ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఆదివారం (నవంబర్ 5,2023) మాజీ మంత్రి డి. జయకుమార్ చెన్నై నగరంలో ఒంటెద్దుపై ప్రయాణించి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. అధికారంలోకి రాకముందు ఇంధన ధరలపై సబ్సిటీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కిన డీఎంకే ప్రభుత్వంపై ఒంటెద్దు బండిపై ప్రయాణించి తన నిరసననలు వినూత్నంగా తెలియజేశారు.
చెన్నైలోని వన్నారపేటలో ఒంటెద్దు బండిపై ప్రయాణించి జయకుమార్ సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలోకి రాకముందు ఇంధన ధరలపై రాయితీ ఇస్తామని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చి ఇంతకాలమైన ఆ విషయాన్ని పట్టించుకోవటంలేదు అంటూ విమర్శించారు. అందుకే ఒంటెద్దు బండిపై ప్రయాణించానని చెప్పుకొచ్చారు. అన్నాడీఎంకే సీనియర్ నేత,మాజీ మంత్రి బండిపై ప్రయాణించటంతో అందరు వింతగా చూస్తుండిపోయారు. పలువురు ఫోటోలు, వీడియోలు తీశారు. కొంతమంది ఆయన్ని అనుసరించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇది వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీ నిరసనను తెలియజేయటానికి అమాకపు జంతువుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇది ఎలాంటి డ్రామా..? అంటూ మరొకరు ప్రశ్నించారు.
#WATCH | Chennai: AIADMK Senior leader and former Tamil Nadu Minister D Jayakumar rode a bullock cart in Vannarapettai, to condemn the DMK government’s delay in fulfilling poll promise to give fuel subsidy. (05.11)
(Video Source: D Jayakumar office) pic.twitter.com/nVRit8xVEs
— ANI (@ANI) November 5, 2023